వచ్చే నెల 9న విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర ప్రమోషన్లు మెల్లగా ఊపందుకుంటున్నాయి. ఇటీవలి బాలీవుడ్ డిజాస్టర్ల దెబ్బకు దీన్ని ఎలా ప్రమోట్ చేస్తే జనం థియేటర్లకు వస్తారో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడ ఏ రూపంలో బాయ్ కాట్ పిలుపులు వినిపిస్తాయోనని భయంతో వణికిపోతున్నారు. అందుకే రిలీజ్ కు కేవలం ఇరవై రోజుల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ హంగామా కనిపించడం లేదు.
దీనికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా మూడు నాలుగు నెలలు నాన్ స్టాప్ గా దేశం మొత్తం తిరిగిన సంగతి తెలిసిందే. సరే ఇంత గ్రాండ్ స్కేల్ లో వస్తున్న మూవీ కాబట్టి దీనికి పోటీతో ఎవరు సాహసం చేస్తారా అనే అనుమానం రావడం సహజం. అయితే అదేం జాన్తానై అంటున్నాయి చిన్న సినిమాలు.
కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ తెలిసే అదే తేదీ క్లాష్ కి సిద్దపడుతోంది. ఎస్ఆర్ కళ్యాణమండపం దర్శకుడు శ్రీధర్ గాదె కాంబోతో పాటు ట్రైలర్ బాగానే ఉండటంతో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. అయితే కిరణ్ గత రెండు డిజాస్టర్లు సెబాస్టియన్, సమ్మతమేల తాలూకు ప్రభావం బిజినెస్ మీదయితే ఉంటుంది.
ఎప్పటి నుంచో వాయిదాల మీద వాయిదాలు తింటున్న సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ ఫైనల్ గా 9కే రావాలని డిసైడ్ అయ్యింది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ కన్నడ లవ్ మాక్ టైల్ కి అఫీషియల్ రీమేక్. ఇదే తరహాలో నెలల తరబడి వేచి చూసిన శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ కూడా ఎట్టకేలకు అదే డేట్ కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన చూస్తుంటే బ్రహ్మాస్త్రను ఇవన్నీ లైట్ గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. తెలుగులో దాని ఎఫెక్ట్ ఉండదనుకున్నారో లేక ట్రైలర్ చూశాక రిస్క్ చేయొచ్చనే ధీమా తెచ్చుకున్నారో ఇంకో మూడు వారాల్లో తేలిపోనుంది
This post was last modified on August 18, 2022 8:25 am
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…