వచ్చే నెల 9న విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర ప్రమోషన్లు మెల్లగా ఊపందుకుంటున్నాయి. ఇటీవలి బాలీవుడ్ డిజాస్టర్ల దెబ్బకు దీన్ని ఎలా ప్రమోట్ చేస్తే జనం థియేటర్లకు వస్తారో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడ ఏ రూపంలో బాయ్ కాట్ పిలుపులు వినిపిస్తాయోనని భయంతో వణికిపోతున్నారు. అందుకే రిలీజ్ కు కేవలం ఇరవై రోజుల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ హంగామా కనిపించడం లేదు.
దీనికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా మూడు నాలుగు నెలలు నాన్ స్టాప్ గా దేశం మొత్తం తిరిగిన సంగతి తెలిసిందే. సరే ఇంత గ్రాండ్ స్కేల్ లో వస్తున్న మూవీ కాబట్టి దీనికి పోటీతో ఎవరు సాహసం చేస్తారా అనే అనుమానం రావడం సహజం. అయితే అదేం జాన్తానై అంటున్నాయి చిన్న సినిమాలు.
కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ తెలిసే అదే తేదీ క్లాష్ కి సిద్దపడుతోంది. ఎస్ఆర్ కళ్యాణమండపం దర్శకుడు శ్రీధర్ గాదె కాంబోతో పాటు ట్రైలర్ బాగానే ఉండటంతో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. అయితే కిరణ్ గత రెండు డిజాస్టర్లు సెబాస్టియన్, సమ్మతమేల తాలూకు ప్రభావం బిజినెస్ మీదయితే ఉంటుంది.
ఎప్పటి నుంచో వాయిదాల మీద వాయిదాలు తింటున్న సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ ఫైనల్ గా 9కే రావాలని డిసైడ్ అయ్యింది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ కన్నడ లవ్ మాక్ టైల్ కి అఫీషియల్ రీమేక్. ఇదే తరహాలో నెలల తరబడి వేచి చూసిన శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ కూడా ఎట్టకేలకు అదే డేట్ కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన చూస్తుంటే బ్రహ్మాస్త్రను ఇవన్నీ లైట్ గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. తెలుగులో దాని ఎఫెక్ట్ ఉండదనుకున్నారో లేక ట్రైలర్ చూశాక రిస్క్ చేయొచ్చనే ధీమా తెచ్చుకున్నారో ఇంకో మూడు వారాల్లో తేలిపోనుంది
This post was last modified on August 18, 2022 8:25 am
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…
దాయాది దేశం పాకిస్థాన్కు ఊహించని పరిణామం ఎదురైంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. తమపై భారత్ కత్తి దూస్తుందని పాక్…