అన్ని సార్లు విజయాలు దక్కవు. కొన్ని సార్లు ఆటు పోటు రెండూ వస్తుంటాయి. తాజాగా అగ్ర పంపిణీ దారుడు , నిర్మాత సుధాకర్ రెడ్డి కి ఇదే జరిగింది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా సినిమా పంపిణీ రంగంలో ఉన్నారు. చాలా సినిమాలు పంపిణీ చేసి లాభాలు అందుకున్నారు. ‘అఖిల్’ సినిమాతో నిర్మాతగా కొంత నష్టపోయారు. ఇటివలే కమల్ హాసన్ విక్రమ్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసి మళ్ళీ సక్సెస్ అందుకున్నాడు.
సుధాకర్ రెడ్డి కి ఉన్న అనుభవంతో కమల్ విక్రమ్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ని ఆయనకి తక్కువ ధరకి ఇచ్చారు. దీంతో నితిన్ తండ్రికి విక్రమ్ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీలో ఈ సినిమా లాభాలతో సుధాకర్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యాడు. అయితే ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసే లోపే నిర్మాతగా ఆయనకి మళ్ళీ ఓ ఫెయిల్యూర్ స్ట్రోక్ తగిలింది. నితిన్ హీరోగా రాజ శేఖర్ అనే ఎడిటర్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
మొదటి రోజు ఓపెనింగ్స్ తో ఫరవాలేదనిపించుకున్నా తర్వాత బొత్తిగా డ్రాప్ అయింది. రెండో రోజే నిఖిల్ వచ్చి ‘కార్తికేయ 2’ తో హిట్ కొట్టడంతో వీకెండ్ లో మోస్తారు కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. ఓవరాల్ గా సినిమా ఫ్లాప్ అనిపించుకుంది. సో డిస్ట్రిబ్యూటర్ గా లాభాలు ఆ వెంటనే నిర్మాతగా నష్టాలు అందుకొని రెండిటినీ బ్యాలెన్స్ చేసుకున్నాడు సుధాకర్ రెడ్డి. మరి ఈయనకి మళ్ళీ సక్సెస్ తెచ్చే సినిమా నిర్మాతగానా డిస్ట్రిబ్యూటర్ గానా చూడాలి.
This post was last modified on August 18, 2022 12:15 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…