అన్ని సార్లు విజయాలు దక్కవు. కొన్ని సార్లు ఆటు పోటు రెండూ వస్తుంటాయి. తాజాగా అగ్ర పంపిణీ దారుడు , నిర్మాత సుధాకర్ రెడ్డి కి ఇదే జరిగింది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా సినిమా పంపిణీ రంగంలో ఉన్నారు. చాలా సినిమాలు పంపిణీ చేసి లాభాలు అందుకున్నారు. ‘అఖిల్’ సినిమాతో నిర్మాతగా కొంత నష్టపోయారు. ఇటివలే కమల్ హాసన్ విక్రమ్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసి మళ్ళీ సక్సెస్ అందుకున్నాడు.
సుధాకర్ రెడ్డి కి ఉన్న అనుభవంతో కమల్ విక్రమ్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ని ఆయనకి తక్కువ ధరకి ఇచ్చారు. దీంతో నితిన్ తండ్రికి విక్రమ్ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీలో ఈ సినిమా లాభాలతో సుధాకర్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యాడు. అయితే ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసే లోపే నిర్మాతగా ఆయనకి మళ్ళీ ఓ ఫెయిల్యూర్ స్ట్రోక్ తగిలింది. నితిన్ హీరోగా రాజ శేఖర్ అనే ఎడిటర్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
మొదటి రోజు ఓపెనింగ్స్ తో ఫరవాలేదనిపించుకున్నా తర్వాత బొత్తిగా డ్రాప్ అయింది. రెండో రోజే నిఖిల్ వచ్చి ‘కార్తికేయ 2’ తో హిట్ కొట్టడంతో వీకెండ్ లో మోస్తారు కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. ఓవరాల్ గా సినిమా ఫ్లాప్ అనిపించుకుంది. సో డిస్ట్రిబ్యూటర్ గా లాభాలు ఆ వెంటనే నిర్మాతగా నష్టాలు అందుకొని రెండిటినీ బ్యాలెన్స్ చేసుకున్నాడు సుధాకర్ రెడ్డి. మరి ఈయనకి మళ్ళీ సక్సెస్ తెచ్చే సినిమా నిర్మాతగానా డిస్ట్రిబ్యూటర్ గానా చూడాలి.
This post was last modified on August 18, 2022 12:15 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…