పృథ్వీరాజ్ సుకుమారన్.. దక్షిణాదిన తిరుగులేని స్టార్ ఇమేజ్, అలాగే బహుముఖ ప్రజ్ఞ కలిగిన హీరోల్లో అతనొకడు. హీరోగా ఎన్నో విజయాలు, నటుడిగా గొప్ప పేరు సంపాదించిన అతను.. దర్శకుడిగా కూడా సత్తా చాటుకున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే.. వేరే చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేయడానికి పృథ్వీరాజ్ వెనుకాడడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ను ప్రభాస్ సినిమా సలార్లో విలన్ పాత్రకు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకున్నాడు. పృథ్వీరాజ్ కూడా ఓకే చెప్పాడు.
కానీ కరోనా కారణంగా షెడ్యూళ్లు మారిపోయి పృథ్వీరాజ్ ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ అతను ఈ సినిమాలో ఉండాల్సిందే అని పట్టుబట్టి ప్రభాస్, ప్రశాంత్ అతణ్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కడువా సినిమా ప్రమోషన్ల కోసం ఆ మధ్య హైదరాబాద్ వచ్చిన పృథ్వీరాజ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను ప్రశాంత్ను కలుస్తున్నానని, ఈ సినిమాలో భాగమయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.
తర్వాత సలార్లో పృథ్వీరాజ్ ఉన్నాడా లేదా అనే విషయంలో క్లారిటీ రాలేదు. ఐతే ఈ విషయంపై ఏ ప్రకటన చేయలేదు కానీ.. పృథ్వీరాజ్ ఈ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పకనే చెప్పాడు. సలార్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చేసిన ట్వీట్లో ప్రశాంత్.. పృథ్వీరాజ్ను ట్యాగ్ చేశాడు. కాబట్టి అతను ఈ సినిమాలో భాగం అయినట్లే. ప్రభాస్ వెర్సస్ పృథ్వీరాజ్ పోరు కచ్చితంగా ఈ సినిమాకు మేజర్ హైలైట్గా నిలవడం ఖాయం.
తనకు ఆఫర్ చేసిన పాత్ర కూడా అద్భుతం అని పృథ్వీరాజ్ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్రశాంత్.. తమిళ నటి శ్రియ రెడ్డి పేరును కూడా ఈ ట్వీట్లో ట్యాగ్ చేయడం గమనార్హం. ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే కానీ.. ఇంటెన్స్ యాక్టింగ్తో ఆకట్టుకుంది. తాజాగా సుడల్ వెబ్ సిరీస్లో శ్రియ అదరగొట్టింది. ఆమె సలార్లో నటిస్తోందంటే తన పాత్రా ప్రత్యేకంగానే ఉండొచ్చు. కేజీఎఫ్ నిర్మాతలే ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయిక అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 17, 2022 8:54 am
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…