విజయ్ దేవరకొండ ఏదైనా వేడుకకు వచ్చినా, ప్రెస్ మీట్లో పాల్గొన్నా, లేదా ప్రమోషనల్ ఈవెంట్కు హాజరైనా.. అందరి దృష్టిని తన వైపు తిప్పేసుకుంటాడు. అతడి మాటలు, చేష్టలు ఏదో రకంగా చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా అతణ్ని వెంటాడుతుంటాయి. అప్పుడప్పుడూ తన ప్రమేయం లేకుండానే అతను వివాదాల్లో భాగం అయిపోతుంటాడు. తాజాగా విజయ్ని కొందరు నెటిజన్లు అనవసరంగా తిట్టడం మొదలుపెట్టారు.
‘లైగర్’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్లో తెలుగు మీడియాను కలిసిన అతను.. స్టేజ్ మీద కాళ్లు పైకి లేపి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి కూర్చున్నట్లుగా ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసి ప్రెస్ మీట్లో ఇంత యాటిట్యూడా.. జర్నలిస్టులతో ఇలాగేనా మాట్లాడేది.. పబ్లిసిటీ కోసం ఇంత అతి చేయాలా.. అంటూ నెటిజన్లు కొందరు అతడి మీద ఫైర్ అయిపోయారు.
కానీ ఈ ఫొటో వెనుక స్టోరీ వేరే ఉంది. విజయ్ కావాలనేమీ అలా కూర్చోలేదు. యాటిట్యూడ్ చూపించలేదు. ఒక విలేకరి అతడికి ప్రశ్న సంధిస్తూ.. ఒకప్పుడు విజయ్ను చాలా ఫ్రీగా ప్రశ్నలు అడిగేవాడినని.. కానీ ఇప్పుడు అతను చాలా పెద్ద స్టార్ అయిపోవడంతో ప్రెస్ మీట్లలో ప్రశ్నలు వేయాలంటే ఇబ్బందిగా ఉందని అన్నాడు.
దీనికి విజయ్ బదులిస్తూ.. ఎందుకంత ఇబ్బంది? అస్సలు మొహమాట పడకండి. చక్కగా కాలు మీద కాలేసుకుని కూర్చోండి, క్యాజువల్గా ప్రశ్నలు అడగండి. నేను కూడా ఫ్రీగా కూర్చుంటా అంటూ కాళ్లు తీసి టేబుల్ మీద పెట్టి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నట్లుగా వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు. ఐతే ప్రెస్ మీట్లో మీడియా ముందు ఇలా కూర్చున్న ఫొటో కెమెరాలకు చిక్కడంతో అది సోషల్ మీడియాలో కొన్ని నిమిషాల్లో వైరల్ అయిపోయింది. విషయం తెలియకుండా కొందరు విజయ్ని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కానీ తర్వాత అసలు వీడియో బయటికి రావడంతో కథ సుఖాంతమైంది.
This post was last modified on August 16, 2022 6:06 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…