విజయ్ దేవరకొండ ఏదైనా వేడుకకు వచ్చినా, ప్రెస్ మీట్లో పాల్గొన్నా, లేదా ప్రమోషనల్ ఈవెంట్కు హాజరైనా.. అందరి దృష్టిని తన వైపు తిప్పేసుకుంటాడు. అతడి మాటలు, చేష్టలు ఏదో రకంగా చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా అతణ్ని వెంటాడుతుంటాయి. అప్పుడప్పుడూ తన ప్రమేయం లేకుండానే అతను వివాదాల్లో భాగం అయిపోతుంటాడు. తాజాగా విజయ్ని కొందరు నెటిజన్లు అనవసరంగా తిట్టడం మొదలుపెట్టారు.
‘లైగర్’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్లో తెలుగు మీడియాను కలిసిన అతను.. స్టేజ్ మీద కాళ్లు పైకి లేపి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి కూర్చున్నట్లుగా ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసి ప్రెస్ మీట్లో ఇంత యాటిట్యూడా.. జర్నలిస్టులతో ఇలాగేనా మాట్లాడేది.. పబ్లిసిటీ కోసం ఇంత అతి చేయాలా.. అంటూ నెటిజన్లు కొందరు అతడి మీద ఫైర్ అయిపోయారు.
కానీ ఈ ఫొటో వెనుక స్టోరీ వేరే ఉంది. విజయ్ కావాలనేమీ అలా కూర్చోలేదు. యాటిట్యూడ్ చూపించలేదు. ఒక విలేకరి అతడికి ప్రశ్న సంధిస్తూ.. ఒకప్పుడు విజయ్ను చాలా ఫ్రీగా ప్రశ్నలు అడిగేవాడినని.. కానీ ఇప్పుడు అతను చాలా పెద్ద స్టార్ అయిపోవడంతో ప్రెస్ మీట్లలో ప్రశ్నలు వేయాలంటే ఇబ్బందిగా ఉందని అన్నాడు.
దీనికి విజయ్ బదులిస్తూ.. ఎందుకంత ఇబ్బంది? అస్సలు మొహమాట పడకండి. చక్కగా కాలు మీద కాలేసుకుని కూర్చోండి, క్యాజువల్గా ప్రశ్నలు అడగండి. నేను కూడా ఫ్రీగా కూర్చుంటా అంటూ కాళ్లు తీసి టేబుల్ మీద పెట్టి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నట్లుగా వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు. ఐతే ప్రెస్ మీట్లో మీడియా ముందు ఇలా కూర్చున్న ఫొటో కెమెరాలకు చిక్కడంతో అది సోషల్ మీడియాలో కొన్ని నిమిషాల్లో వైరల్ అయిపోయింది. విషయం తెలియకుండా కొందరు విజయ్ని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కానీ తర్వాత అసలు వీడియో బయటికి రావడంతో కథ సుఖాంతమైంది.
This post was last modified on August 16, 2022 6:06 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…