విజయ్ దేవరకొండ ఏదైనా వేడుకకు వచ్చినా, ప్రెస్ మీట్లో పాల్గొన్నా, లేదా ప్రమోషనల్ ఈవెంట్కు హాజరైనా.. అందరి దృష్టిని తన వైపు తిప్పేసుకుంటాడు. అతడి మాటలు, చేష్టలు ఏదో రకంగా చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా అతణ్ని వెంటాడుతుంటాయి. అప్పుడప్పుడూ తన ప్రమేయం లేకుండానే అతను వివాదాల్లో భాగం అయిపోతుంటాడు. తాజాగా విజయ్ని కొందరు నెటిజన్లు అనవసరంగా తిట్టడం మొదలుపెట్టారు.
‘లైగర్’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్లో తెలుగు మీడియాను కలిసిన అతను.. స్టేజ్ మీద కాళ్లు పైకి లేపి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి కూర్చున్నట్లుగా ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసి ప్రెస్ మీట్లో ఇంత యాటిట్యూడా.. జర్నలిస్టులతో ఇలాగేనా మాట్లాడేది.. పబ్లిసిటీ కోసం ఇంత అతి చేయాలా.. అంటూ నెటిజన్లు కొందరు అతడి మీద ఫైర్ అయిపోయారు.
కానీ ఈ ఫొటో వెనుక స్టోరీ వేరే ఉంది. విజయ్ కావాలనేమీ అలా కూర్చోలేదు. యాటిట్యూడ్ చూపించలేదు. ఒక విలేకరి అతడికి ప్రశ్న సంధిస్తూ.. ఒకప్పుడు విజయ్ను చాలా ఫ్రీగా ప్రశ్నలు అడిగేవాడినని.. కానీ ఇప్పుడు అతను చాలా పెద్ద స్టార్ అయిపోవడంతో ప్రెస్ మీట్లలో ప్రశ్నలు వేయాలంటే ఇబ్బందిగా ఉందని అన్నాడు.
దీనికి విజయ్ బదులిస్తూ.. ఎందుకంత ఇబ్బంది? అస్సలు మొహమాట పడకండి. చక్కగా కాలు మీద కాలేసుకుని కూర్చోండి, క్యాజువల్గా ప్రశ్నలు అడగండి. నేను కూడా ఫ్రీగా కూర్చుంటా అంటూ కాళ్లు తీసి టేబుల్ మీద పెట్టి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నట్లుగా వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు. ఐతే ప్రెస్ మీట్లో మీడియా ముందు ఇలా కూర్చున్న ఫొటో కెమెరాలకు చిక్కడంతో అది సోషల్ మీడియాలో కొన్ని నిమిషాల్లో వైరల్ అయిపోయింది. విషయం తెలియకుండా కొందరు విజయ్ని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కానీ తర్వాత అసలు వీడియో బయటికి రావడంతో కథ సుఖాంతమైంది.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…