విజయ్ దేవరకొండ ఏదైనా వేడుకకు వచ్చినా, ప్రెస్ మీట్లో పాల్గొన్నా, లేదా ప్రమోషనల్ ఈవెంట్కు హాజరైనా.. అందరి దృష్టిని తన వైపు తిప్పేసుకుంటాడు. అతడి మాటలు, చేష్టలు ఏదో రకంగా చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా అతణ్ని వెంటాడుతుంటాయి. అప్పుడప్పుడూ తన ప్రమేయం లేకుండానే అతను వివాదాల్లో భాగం అయిపోతుంటాడు. తాజాగా విజయ్ని కొందరు నెటిజన్లు అనవసరంగా తిట్టడం మొదలుపెట్టారు.
‘లైగర్’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్లో తెలుగు మీడియాను కలిసిన అతను.. స్టేజ్ మీద కాళ్లు పైకి లేపి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి కూర్చున్నట్లుగా ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసి ప్రెస్ మీట్లో ఇంత యాటిట్యూడా.. జర్నలిస్టులతో ఇలాగేనా మాట్లాడేది.. పబ్లిసిటీ కోసం ఇంత అతి చేయాలా.. అంటూ నెటిజన్లు కొందరు అతడి మీద ఫైర్ అయిపోయారు.
కానీ ఈ ఫొటో వెనుక స్టోరీ వేరే ఉంది. విజయ్ కావాలనేమీ అలా కూర్చోలేదు. యాటిట్యూడ్ చూపించలేదు. ఒక విలేకరి అతడికి ప్రశ్న సంధిస్తూ.. ఒకప్పుడు విజయ్ను చాలా ఫ్రీగా ప్రశ్నలు అడిగేవాడినని.. కానీ ఇప్పుడు అతను చాలా పెద్ద స్టార్ అయిపోవడంతో ప్రెస్ మీట్లలో ప్రశ్నలు వేయాలంటే ఇబ్బందిగా ఉందని అన్నాడు.
దీనికి విజయ్ బదులిస్తూ.. ఎందుకంత ఇబ్బంది? అస్సలు మొహమాట పడకండి. చక్కగా కాలు మీద కాలేసుకుని కూర్చోండి, క్యాజువల్గా ప్రశ్నలు అడగండి. నేను కూడా ఫ్రీగా కూర్చుంటా అంటూ కాళ్లు తీసి టేబుల్ మీద పెట్టి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నట్లుగా వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు. ఐతే ప్రెస్ మీట్లో మీడియా ముందు ఇలా కూర్చున్న ఫొటో కెమెరాలకు చిక్కడంతో అది సోషల్ మీడియాలో కొన్ని నిమిషాల్లో వైరల్ అయిపోయింది. విషయం తెలియకుండా కొందరు విజయ్ని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కానీ తర్వాత అసలు వీడియో బయటికి రావడంతో కథ సుఖాంతమైంది.
This post was last modified on August 16, 2022 6:06 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…