ఆశించిన దానికన్నా పెద్ద స్థాయిలో కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ముఖ్యంగా చాలా తక్కువ స్క్రీన్లు దక్కిన నార్త్ బెల్ట్ లో ఇవాళ్టి నుంచే థియేటర్లను పెంచారు. శనివారం అరవైతో మొదలై ఇప్పుడు మూడు వందలకు చేరువగా ఉంది. పందొమ్మిదో తేదీ నుంచి ఇదింకా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ ఫస్ట్ వీక్ అగ్రిమెంట్లు పూర్తవుతాయి కాబట్టి ఆ స్థానంలో కార్తికేయ 2 హిందీ వెర్షన్ ని వేయబోతున్నారు. ముంబై, ఢిల్లీ, పూణే, అహ్మదాబాద్, గుర్గావ్ లాంటి నగరాల్లో బుకింగ్స్ చాలా బాగుంటున్నాయి.
దీని సంగతలా ఉంచితే ఇందులో కేవలం పది నిమిషాలలోపే ఉన్న కీలకమైన ప్రొఫెసర్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ కృష్ణుడి గొప్పదనం గురించి వర్ణించే సీన్ ఓ రేంజ్ లో పేలిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన కనిపించకపోయినా దాని తాలూకు ఇంపాక్ట్ క్లైమాక్స్ దాకా అలా ఉండిపోయింది. సోషల్ మీడియా మీమర్స్ కూడా ఈ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో హిందూ సెంటిమెంట్ తో ఊగిపోతున్న ఉత్తరాది ప్రేక్షకులకు కృష్ణతత్వాన్ని అనుపమ్ ఖేర్ తో చెప్పించడంతో వాళ్లకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది.
నిజానికి ఇంత చిన్న వేషానికి ఎలా ఒప్పుకున్నారన్న సందేహం లేకపోలేదు. దానికి కారణం ఉంది. కార్తికేయ 2 నిర్మాత అబిషేక్ పిక్చర్సే ఆ మధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ ది కాశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్. అందులో అనుపమ్ ఖేర్ ఎంత గొప్ప పెర్ఫార్మన్స్ ఇచ్చారో ఎవరూ మర్చిపోలేరు. అది నిర్మాణంలో ఉన్నప్పుడే అభిషేక్ అగర్వాల్ కార్తికేయ 2 గురించి పెద్దాయనకు చెప్పడం, అందులోనూ దైవత్వం టచ్ ఉన్న సీన్ కావడంతో ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. దీని తర్వాత ఎక్కువ లెన్త్ ఉన్న రోల్ ని ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో చేస్తున్నారు
This post was last modified on August 15, 2022 10:23 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…