విజయ్ దేవరకొండ తో పూరి ‘లైగర్’ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ సినిమాకు అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి కి లింకేసి పూరి మళ్లీ అదే తీస్తున్నాడా అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. అమ్మ సెంటిమెంట్, స్పోర్ట్ మిక్స్ చేసిన థీమ్ ఒకే విధంగా అనిపిస్తుండటంతో అందరిలో ఈ డౌట్ రైజ్ అవుతుంది.
తాజాగా హీరో విజయ్ దేవరకొండ కి కూడా ఇదే ప్రశ్న మీడియా నుండి ఎదురైంది. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి కి ఈ సినిమా అప్ గ్రేడ్ వర్షన్ అనుకోవచ్చా ? అని అడగ్గానే విజయ్ కూల్ గా రియాక్ట్ అయ్యాడు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ఇప్పుడు మళ్లీ సేమ్ తీసినా హిట్ అవుతుందని అసలు భయమే అక్కర్లేదని కానీ లైగర్ కి ఆ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.
అమ్మ- కొడుకుల ఎమోషన్ వల్ల అలా అనిపించొచ్చు తప్ప మిగతా కథంతా వేరుగా ఉంటుందని తెలిపాడు. అలాగే ఇందులో తాము కిక్ బాక్సింగ్ తీసుకోలేదని, మార్షల్ ఆర్ట్స్ చూపించామని ఇది వేరే సినిమా, అయినా నేనెందుకు ఆ సినిమా రీమేక్ చేస్తాను నాకసలు రీమేక్ అంటే నచ్చదు అంటూ క్లారిటీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
ఇక లైగర్ ప్రమోషన్స్ కి వచ్చేసరికి తన బాడీ సహకరించడం లేదని, అయినా మెంటల్ గా సంతోషంగా ఉన్నానని అన్నాడు. ఒక వారం బాడీ కి రెస్ట్ ఇస్తే మళ్లీ సెట్ అవుతుందని, కానీ రెండేళ్లు కష్టపడిన సినిమా కోసం రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్స్ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నాడు. ఏదేమైనా పూరి అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి కథకు ఇంకో వర్షన్ లో రాసి ‘లైగర్’ తీసినట్టే అనిపిస్తుంది. మరి రిలీజ్ తర్వాత ఆడియన్స్ డౌటే నిజమవుతుందా ? లేదా విజయ్ చెప్పినట్టు దానికి దీనికి ఏ మాత్రం సంబంధం ఉండదా ? చూడాలి.
This post was last modified on August 15, 2022 10:04 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…