ఇన్నేళ్ల భారతీయ సినీ చరిత్రలో బాలీవుడ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం ఎన్నడూ ఎదుర్కోలేదు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేంతగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని సినిమాల క్వాలిటీ, కలెక్షన్లు, రికార్డులు, మార్కెట్, అవార్డులు.. ఇలా ఏ రకంగా చూసుకున్నా మిగతా ఇండస్ట్రీల మీద పూర్తి పైచేయి చలాయిస్తూ దశాబ్దాలుగా టాప్లో ఉన్న బాలీవుడ్.. ఇప్పుడు రీజనల్ ఫిలిం ఇండస్ట్రీల ముందు నిలవలేకపోతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాలు దేశాన్ని ఊపేస్తూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదిస్తూ వందలు వేల కోట్ల వసూళ్లు రాబడుతుంటే.. హిందీ చిత్రాలు అన్ని రకాలుగా చతికిలపడుతున్నాయి.
ఒకప్పుడు కేక్ వాక్ లాగా ఉన్న వంద కోట్ల వసూళ్లు ఇప్పుడు అందని ద్రాక్షలా మారిపోయాయి బాలీవుడ్ సినిమాలకు. పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా తొలి రోజు పది కోట్ల వసూళ్ల మార్కును అందుకోవడం కష్టం అయిపోతోంది. సినిమా రిలీజై అందులో విషయం లేకపోవడం వల్ల ఫ్లాప్ అయితే ఓకే అనుకోవచ్చు. కానీ విడుదలకు ముందే సినిమా ఫలితం నిర్ణయం అయిపోతోంది. సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు అదే పనిగా హిందీ చిత్రాలను బాయ్కాట్ చేయాలంటూ ట్రెండ్స్ చేయడం.. రోజులు వారాల తరబడి నెగెటివిటీని స్ప్రెడ్ చేసి సినిమాలను కిల్ చేస్తుండటం ఆందోళనకరంగా మారుతోంది.
అసలే కొవిడ్ దెబ్బకు అల్లాడిపోయిన బాలీవుడ్కు ఈ ‘బాయ్కాట్’ నినాదాలు శరాఘాతంలా మారుతున్నాయి. సోషల్ మీడియాలో కొంతమంది నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తే ఏం జరుగుతుంది.. దాని వల్ల సినిమాలు ఆడకుండా పోతాయా అని తేలిగ్గా తీసుకున్న వాళ్లు ‘లాల్ సింగ్ చడ్డా’కు వచ్చిన ఓపెనింగ్స్, నెగెటివ్ టాక్ వైల్డ్ ఫైర్ లాగా విస్తరించిన వైనం చూసి అవాక్కవుతున్నారు. ఆమిర్ సినిమాలకు ఒకప్పుడు టాక్తో సంబంధం లేకుండా తొలి రోజు ఇండియాలో రూ.25-30 కోట్ల మినిమం వసూళ్లు వచ్చేవి.
అలాంటిది ‘లాల్ సింగ్ చడ్డా’కు రూ.12 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే రావడం.. తొలి రోజు జనాలు లేక 1300 షోలు క్యాన్సిల్ కావడం విస్మయం కలిగిస్తోంది. ఇదంతా బాయ్కాట్ నినాదాల ఫలితం అన్నది స్పష్టం. ఇకపై ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. బాలీవుడ్ దీనిపై ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టడం.. తమ పరిస్థితిని జనాలకు వివరించే ప్రయత్నం చేయడం.. తమలో హిందూ వ్యతిరేక భావజాలం లేదని, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ అందులో ఏ బాలీవుడ్ ప్రముఖుల పాత్ర లేదని వివరించడం.. ఒక సినిమా వెనుక ఉండే కష్టం, దాని మీద ఆధారపడ్డ కుటుంబాల గురించి ఆవేదన భరితంగా చెప్పే ప్రయత్నం చేయడం చాలా అవసరం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 14, 2022 4:21 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…