Movie News

ముగ్గురూ ముగ్గురే – ఇంకెంత లేటు

సబ్జెక్టు బాగా రాలేదనే కారణంతోనో లేదా ఇంకా ప్లానింగ్ పూర్తవ్వలేదనే వంకతోనో స్టార్ హీరోలు కొత్త సినిమాల షూటింగులు మరీ ఎక్కువ జాప్యం చేయడం అభిమానులకు అసంతృప్తి కలిగిస్తుందేమో కానీ పరిశ్రమకు సంబంధించి ఎందరికో ఉపాధిని ఆలస్యం చేస్తుంది. దాదాపు అందరూ ఆయా ప్రాజెక్టుల్లో బిజీగా ఉండగా ముగ్గురు టాప్ స్టార్స్ మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. అందులో మొదటి పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 స్క్రిప్ట్ ని చెక్కుతూనే ఉన్నారు తప్ప ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మాత్రం మైత్రి మేకర్స్ అప్ డేట్ ఇవ్వడం లేదు.

దీనికే ఇంకో ఏడాది పడితే బన్నీ నెక్స్ట్ మూవీ ఏ 2024 చివరిలో రిలీజ్ అవుతుంది. పైగా ఎవరితో చేయాలనే క్లారిటీ కూడా పుష్ప ఆలస్యం వల్లే రావడం లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ ఎదురు చూసే కొద్దీ పట్టాలెక్కడంలో లేట్ చేస్తూనే ఉంది. ఆచార్య తాలూకు తలనెప్పులు కొరటాలకు దాదాపు తీరిపోయాయి. మరి తారక్ పని మీదే ఉన్నాడా లేక ఫైనల్ వెర్షన్ ని సిద్ధం చేశాడా అనేది ఆ ఇద్దరికీ మాత్రమే తెలిసిన రహస్యం. ఇక మహేష్ బాబు విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చినా త్రివిక్రమ్ టీమ్ సైలెంట్ గానే ఉంది.

బహుశా సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా ఈ ముగ్గురు సెట్స్ లో అడుగు పెట్టి ఆరు నెలలు పైనే అయ్యింది. ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక తారక్, బన్నీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండగా మహేష్ మాత్రం ఎప్పటిలాగే హడావిడికి దూరంగా ఏడాదికి ఒకటే చాలనుకుంటున్నాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం రాజమౌళికి రెండు మూడేళ్లు వెళ్లిపోతాయి కాబట్టి ఆలోగా ఇంకో క్రేజీ కాంబో ఒకటి చేసేయమని అడుగుతున్నారు. మొత్తానికి ఆ త్రీ స్టార్స్ షూటింగుల కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు 

This post was last modified on August 13, 2022 1:08 am

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

3 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

4 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

5 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

6 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

10 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

11 hours ago