ఇంకో రెండే వారాల్లో లైగర్ రాబోతోంది. విజయ్ దేవరకొండ ఎడతెరిపి లేకుండా నార్త్ ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నాడు. విపరీతంగా తిరిగేస్తూ హీరోయిన్ అనన్య పాండేతో కలిసి చురుగ్గా ప్రోగ్రాంస్ లో పాల్గొంటున్నాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ వీటిలో అధిక శాతం హాజరు కాలేకపోయినా ఫైనల్ కాపీ సిద్ధం చేసే పనులు చూసుకోవాలి కాబట్టి తప్పుబట్టడానికి లేదు.
లిరికల్ వీడియోలు క్రమం తప్పకుండా వదులుతున్నారు, హిట్టవుతున్నాయి కానీ అవేవీ యూట్యూబ్ మొత్తం షేకై పోయే సోషల్ మీడియా ఊగిపోయే రేంజ్ లో వైరల్ కావడం లేదు. ఇదిలా ఉండగా లైగర్ ఫోకస్ మొత్తం నార్త్ బెల్ట్ మీదే ఉండటం పట్ల మన బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. ఎంత ఇమేజ్ ఉన్నా విజయ్ దేవరకొండకు గత రెండు డిజాస్టర్ల ప్రభావం ఇక్కడి మార్కెట్ మీద ఉంది.
ఓపెనింగ్స్ గ్యారెంటీనే కానీ మార్నింగ్ షోస్ అయ్యాక న్యూట్రల్ ఆడియన్స్ రావాలంటే హైప్ చాలా కీలకం. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు కొట్టాలంటే ఇది ఫస్ట్ డేనే చూసి తీరాలన్నంత బజ్ ని సృష్టించాలి. ఇప్పటికైతే లైగర్ నుంచి ఆ స్థాయి పబ్లిసిటీ జోరూ హంగామా తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు. చేతిలో కేవలం పధ్నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఫోకస్ పెట్టడం చాలా అవసరం. రేపేదైనా తేడా వస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మొదటిరోజే తిరస్కరిస్తారు.
కానీ ఏపి తెలంగాణలో అలా కాదు. యావరేజ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కు అవకాశాలుంటాయి. అలా అని టాలీవుడ్ పరిస్థితులను లైట్ తీసుకోవడానికి లేదు. కానీ హిందీ వెర్షన్ హక్కుదారుడు కరణ్ జోహార్ ప్రమేయం వల్లే లైగర్ టీమ్ అక్కడ ఇరుక్కుపోయిందని ఆఖరికి అతని కాఫీ షోలో పాల్గొనేందుకు టైం దొరికిన హీరో హీరోయిన్లకు తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సమయం లేదన్న కామెంట్లు ఓపెన్ గానే విన్పిస్తున్నాయి, మరి లైగర్ ఏ రూపంలో సమాధానం ఇస్తుందో చూడాలి.
This post was last modified on August 12, 2022 12:39 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…