భలే మంచి చౌక బేరము అని పాడుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. లక్షలు పెట్టి ఏదో ఒక బూతు సినిమా తీయడం.. కోట్లు జేబులో వేసుకోవడం.. ఇదీ ఇప్పుడు వర్మ వరస. పోర్న్ స్టార్ మియా మాల్కోవాను పెట్టి ‘క్లైమాక్స్’ అనే సినిమా తీసి కోట్లు సంపాదించిన వర్మ.. ఈ మధ్యే స్వీటీ అనే లోకల్ అమ్మాయిని పెట్టి ‘నేక్డ్’ అనే నాసిరకం బూతు సినిమా ఒకటి తీసిన సంగతి తెలిసిందే. 2
2 నిమిషాల నిడివే ఉన్న ఈ సినిమాకు మొత్తం పెట్టిన ఖర్చు రూ.5 లక్షలేనట. దీనికి రూ.200 టికెట్ రేటు పెడితే.. దాన్ని కూడా వేలమంది ఎగబడి చూశారు. దాని ద్వారా కూడా వర్మకు బాగానే గిట్టుబాటు అయింది. థియేట్రికల్ రిలీజ్కు అవకాశం లేని ఈ రోజుల్లో ఓటీటీల స్టయిల్లో సొంతంగా ఒక ఫ్లాట్ ఫాం పెట్టి అందులో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో వర్మ ఈ సినిమాల్ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈసారి ఆయన్నుంచి ‘12 ఓ క్లాక్’ పేరుతో కొత్త సినిమా రానుంది. ఐతే ఇది గత రెండు సినిమాల్లాగా షార్ట్ ఫిలిం స్థాయిలో ఉండదట. దీని నిడివి గంటా 45 నిమిషాలట. ఎవరితోనో సినిమా తీయించి.. తన పేరుతో ప్రమోట్ చేయట్లేదు వర్మ ఈసారి. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది ఆయనే. ఈ సినిమాకు సంబంధించి పెద్ద ట్విస్టు ఏంటంటే.. దీనికి ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతం అందించారు.
వర్మ దర్శకుడిగా, వ్యక్తిగా తన స్థాయిని ఎంతగా తగ్గించుకున్నప్పటికీ.. ఆయనపై కీరవాణికి ప్రత్యేక అభిమానం ఉందని అంటారు సన్నిహితులు. ఆ అభిమానంతోనే వర్మ కొత్త చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి అంగీకరించినట్లున్నాడు కీరవాణి. వర్మ సినిమాలను జనాలు మరీ చీప్గా చూస్తున్న సమయంలో పోస్టర్ మీద కీరవాణి పేరు కనిపించడం షాకింగే. ఎన్నో ఏళ్లుగా ఏ సినిమాకైనా రవిశంకర్తోనే మ్యూజిక్ చేయించుకుంటున్న వర్మ.. దీనికి ప్రత్యేకంగా కీరవాణి సాయం ఎందుకు అడిగాడో?
This post was last modified on July 3, 2020 4:29 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…