ప్రతీ సినిమా వెనుక ఎవరికీ తెలియని ఎన్నో కథలుంటాయి. అవి ఆ సినిమా దర్శకుడో లేదా నటీ నటులో బయటపెడితేనే ప్రేక్షకులకు తెలుస్తుంది. తాజాగా తన సినిమా చెన్నకేశవరెడ్డి గురించి ఇలాంటి కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్. తెరవెనుక కథలు అనే షోలో ఈ సినిమా గురించి చెప్పుకున్నాడు వీవీ వినాయక్.
“చెన్నకేశవరెడ్డి లో టబు చేసిన రోల్ కి ముందుగా సౌందర్య ని అనుకున్నాం. ఆమె నాకు పరిచయం ఉండటంతో బెంగళూర్ వెళ్లి కథ చెప్పాను. ఇందులో రెండు గెటప్స్ ఉంటాయని , చివర్లో ముసలి గెటప్ లో కనిపించాలని చెప్పాను. నెరేషన్ అయ్యాక ఆమె ఈ కేరెక్టర్ చేయలేను అనేసింది. దానికి కారణం ఇప్పుడే వృద్దురాలిగా కనిపించే పాత్ర చేయకూడదు అనుకుంటున్నానని చెప్పారు. నేను సరే అండి అని వచ్చేశా ఆ తర్వాత టబు గారిని అప్రోచ్ అవ్వగానే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.” అంటూ సౌందర్య బాలయ్య సినిమా ఎందుకు చేయలేదో చెప్పుకున్నాడు వినాయక్.
అలాగే సినిమాలో చెల్లెలి పాత్రలో నటించిన దేవయాని కేరెక్టర్ కోసం ముందుగా హీరోయిన్ లయ ని సంప్రదిస్తే ఆమె ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా సినిమాలు చేస్తుంటే మీరు చెల్లెలి కేరెక్టర్ చేయమనడం న్యాయమేనా ? అంటూ ఏడ్చేసిందని వినాయక్ చెప్పారు. ఆ సినిమాలో దేవయాని కేరెక్టర్ ఎంత క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఆమె కూడా అప్పుడు హీరోయిన్ గా ఏవో చిన్న చితకా సినిమాలు చేస్తుంది అయినా వినాయక్ చెప్పిన కేరెక్టర్ కి ఓకె చెప్పేసి బాలయ్య చెల్లెలిగా మెప్పించింది.
This post was last modified on August 11, 2022 12:59 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…