విజయ్ దేవరకొండ ఏం చేసినా సంచలనమే.. వార్తాంశమే. తన కొత్త చిత్రం ‘లైగర్’ ప్రమోషన్లలో భాగంగా అతను పాల్గొంటున్న ప్రెస్ మీట్లు, స్పెషల్ ఈవెంట్లలో సందడి అందరూ చూస్తూనే ఉన్నారు. విజయ్కి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ.. ‘లైగర్’కు ముందు వరకు ఏ పాన్ ఇండియా సినిమా చేయకపోయినా, హిందీలో నటించకపోయినా అతడికి ఉత్తరాదిన మంచి క్రేజ్ కనిపిస్తోంది. బీహార్, అహ్మదాబాద్.. ఇలా అతను పర్యటించిన ప్రతి చోటా యువత విరగబడి వస్తున్నారు.
వాళ్లను విజయ్ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తున్నాడు. కాగా ఈ ఈవెంట్లలో చిత్రంగా విజయ్ చెప్పులేసుకుని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముంబయిలో పోష్ డ్రెస్ వేసుకుని దానికి మ్యాచ్ అయ్యే షూలు వేసుకోకుండా చెప్పులతో కనిపించి అందరికీ పెద్ద షాకిచ్చాడు విజయ్. ఇదేమైనా కొత్త ఫ్యాషన్ ట్రెండా అని అంతా ఆశ్చర్యపోయాడు. ఐతే దీనికి ప్రత్యేక కారణం ఏమీ లేదంటున్నాడు విజయ్.
‘‘ప్రమోషన్లలో భాగంగా ప్రతి రోజూ ఒక డ్రెస్ వేసుకుంటున్నా. దానికి నప్పే షూస్ కోసం వెతుక్కోవడానికి, వాటిని వేసి తీయడానికి చాలా సమయం పడుతోంది. అందుకే ఈ చెప్పులు కొనుక్కున్నా. దీని వల్ల నా డ్రెస్సింగ్కి ఎక్కువ సమయం పట్టడం లేదు. నేను చెప్పులేసుకుని ప్రమోషన్లలో పాల్గొనడం వల్ల ఎవరైనా ఏమన్నా అనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తా’’ అని తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు విజయ్.
‘లైగర్’ మూవీ తప్పకుండా బ్లాక్బస్టర్ అవుతుందనే నమ్మకం తనకుందని, ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ చేరువ చేయడానికి ఇంకో రెండు వారాల సమయమే ఉందని.. అందుకే ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నామని విజయ్ వివరించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్-అనన్య పాండే జంటగా నటించిన ‘లైగర్’ను ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మించారు. విజయ్ కెరీర్ మలుపు తిరగడానికి కారణమైన ‘అర్జున్ రెడ్డి’ రిలీజైన ఆగస్టు 25నే ఈ చిత్రం కూడా పలు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on August 10, 2022 4:40 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…