విజయ్ దేవరకొండ ఏం చేసినా సంచలనమే.. వార్తాంశమే. తన కొత్త చిత్రం ‘లైగర్’ ప్రమోషన్లలో భాగంగా అతను పాల్గొంటున్న ప్రెస్ మీట్లు, స్పెషల్ ఈవెంట్లలో సందడి అందరూ చూస్తూనే ఉన్నారు. విజయ్కి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ.. ‘లైగర్’కు ముందు వరకు ఏ పాన్ ఇండియా సినిమా చేయకపోయినా, హిందీలో నటించకపోయినా అతడికి ఉత్తరాదిన మంచి క్రేజ్ కనిపిస్తోంది. బీహార్, అహ్మదాబాద్.. ఇలా అతను పర్యటించిన ప్రతి చోటా యువత విరగబడి వస్తున్నారు.
వాళ్లను విజయ్ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తున్నాడు. కాగా ఈ ఈవెంట్లలో చిత్రంగా విజయ్ చెప్పులేసుకుని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముంబయిలో పోష్ డ్రెస్ వేసుకుని దానికి మ్యాచ్ అయ్యే షూలు వేసుకోకుండా చెప్పులతో కనిపించి అందరికీ పెద్ద షాకిచ్చాడు విజయ్. ఇదేమైనా కొత్త ఫ్యాషన్ ట్రెండా అని అంతా ఆశ్చర్యపోయాడు. ఐతే దీనికి ప్రత్యేక కారణం ఏమీ లేదంటున్నాడు విజయ్.
‘‘ప్రమోషన్లలో భాగంగా ప్రతి రోజూ ఒక డ్రెస్ వేసుకుంటున్నా. దానికి నప్పే షూస్ కోసం వెతుక్కోవడానికి, వాటిని వేసి తీయడానికి చాలా సమయం పడుతోంది. అందుకే ఈ చెప్పులు కొనుక్కున్నా. దీని వల్ల నా డ్రెస్సింగ్కి ఎక్కువ సమయం పట్టడం లేదు. నేను చెప్పులేసుకుని ప్రమోషన్లలో పాల్గొనడం వల్ల ఎవరైనా ఏమన్నా అనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తా’’ అని తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు విజయ్.
‘లైగర్’ మూవీ తప్పకుండా బ్లాక్బస్టర్ అవుతుందనే నమ్మకం తనకుందని, ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ చేరువ చేయడానికి ఇంకో రెండు వారాల సమయమే ఉందని.. అందుకే ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నామని విజయ్ వివరించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్-అనన్య పాండే జంటగా నటించిన ‘లైగర్’ను ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మించారు. విజయ్ కెరీర్ మలుపు తిరగడానికి కారణమైన ‘అర్జున్ రెడ్డి’ రిలీజైన ఆగస్టు 25నే ఈ చిత్రం కూడా పలు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on August 10, 2022 4:40 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…