చాన్నాళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. గత వారాంతంలో విడుదలైన సీతారామం, బింబిసార చిత్రాలు వీకెండ్లో చక్కటి వసూళ్లు సాధించాయి. ఆ తర్వాత కూడా బాగానే ఆడుతున్నాయి. ఈ వారం ఒకటికి మూడు కొత్త చిత్రాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. అవన్నీ కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నవే. దీంతో థియేటర్లలో మరింతగా సందడి నెలకొంటుందని అంచనా వేస్తున్నారు.
రెండు నెలల స్లంప్ తర్వాత ఇలాంటి జోష్ అందరికీ ఉత్సాహాన్నిచ్చేదే. కానీ ఇలాంటి టైంలో ప్రభుత్వం తెలంగాణలోని థియేటర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేర మంగళవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు తెలంగాణలోని థియేటర్లలో మార్నింగ్ షోను గాంధీ సినిమాకు కేటాయించాలంటూ ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ షోను ఉచితంగా ప్రదర్శించాలన్నది నిబంధన.
మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు అని తేడా లేకుండా ఈ 13 రోజల పాటు గాంధీ సినిమానే ప్రదర్శించాలట. దీంతో మార్నింగ్ షోలకు మినహాయించి థియేటర్లలో వేరే షోలకు మాత్రమే ఆన్ లైన్ బుకింగ్స్ నడుస్తున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న అమృత మహోత్సవాల నేపథ్యంలో ప్రజల్లో దేశభక్తి భావం పెంపొందించేందుకు, మహాత్మా గాంధీ గొప్పదనం గురించి ఈ తరం తెలుసుకునేలా చేసేందుకు ఈ షో ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఐతే ఒకట్రెండు రోజులైతే ఓకే కానీ.. 13 రోజుల పాటు ప్రతి థియేటర్లో మార్నింగ్ షోను ఆ చిత్రానికి కేటాయించి ఉచితంగా ప్రదర్శించాలంటే థియేటర్లకు కష్టమే.
అందులోనూ థియేటర్లలో మంచి సినిమాలు ఆడుతూ, రాబోయే చిత్రాలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నపుడు.. ఉన్న సినిమాలకే షోలు కేటాయించడం కష్టంగా మారినపుడు ఇలా నిర్బంధంగా ఉచిత షోను కేటాయించడం ఇబ్బందే. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఇంతే పట్టుదలగా ఉడి 21వ తేదీ వరకు ఈ షోను కొనసాగించాలంటుందా.. లేక మధ్యలో జీవోను విరమిస్తుందా అన్నది చూడాలి.
This post was last modified on August 10, 2022 9:20 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…