స్వప్న దత్, ప్రియాంక దత్.. ఇప్పుడు టాలీవుడ్లో ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్న నిర్మాతలు వీళ్లు. లెజెండరీ ప్రొడ్యూసర్, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ కూతుళ్లే వీళ్లిద్దరూ అన్న సంగతి తెలిసిందే. శక్తి సహా కొన్ని డిజాస్టర్ల దెబ్బకు ఒక దశలో నిర్మాణం ఆపేయాల్సిన స్థితికి చేరిన అశ్వినీదత్కు అండగా నిలిచింది కూతుళ్లే.
స్వప్న సినిమాస్ అని కొత్తగా బేనర్ పెట్టి ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి చిన్న సినిమాలతో ప్రస్థానం మొదలుపెట్టి నెమ్మదిగా సినిమాల స్థాయి పెంచుకుంటూ మహానటి లాంటి అద్భుతమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమాతో వైజయంతీ మూవీస్ పేరు మళ్లీ మార్మోగేలా చేశారు. గత ఏడాది జాతి రత్నాలు మూవీతో కమర్షియల్గా మంచి సక్సెస్ అందుకున్న స్వప్న, ప్రియాంక.. ఇప్పుడు సీతారామం సినిమాతో మరోసారి తమ అభిరుచిని చాటారు. కమర్షియల్గానూ మంచి ఫలితం అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
సీతారామంకు ముందు దర్శకుడు హను రాఘవపూడి పరిస్థితి తెలిసిందే. అతను చివరగా తీసిన పడి పడి లేచె మనసు పెద్ద డిజాస్టర్. అంతకుముందు లై లాంటి మరో డిజాస్టర్ తీశాడతను. ఇలాంటి ట్రాక్ రికార్డును నమ్మి, పరభాషా హీరో హీరోయిన్లను పెట్టి రూ.40 కోట్ల బడ్జెట్లో సినిమా తీయాలంటే ఎంత గట్స్ ఉండాలి. ఏమాత్రం రాజీ లేకుండా అత్యుత్తమ సాంకేతిక నిపుణల్ని సమకూర్చి, చాలా కష్టమైన లొకేషన్లలో, బాగా ఖర్చు పెట్టి సినిమా తీయడం, దర్శకుడు కోరిందంతా సమకూర్చడం అందరు నిర్మాతలూ చేయలేరు.
హను ప్రతిభను, అతడి కథలోని సత్తాను నమ్మి, తన విజన్కు తగ్గట్లుగా ఇలా రాజీ లేకుండా సినిమాను నిర్మించే నిర్మాతలు దొరకడం నిజంగా అతడి అదృష్టమే. వాళ్లు హనును నమ్మి తన విజన్కు వెండితెర రూపం ఇచ్చారు కాబట్టే తెలుగు ప్రేక్షకులు ఈ రోజు అద్భుతమైన సినిమా చూసే అవకాశం దక్కింది. తెలుగు సినిమాకు కూడా సీతారామం గర్వకారణంగా నిలుస్తోంది. ఇందుకు దత్ కూతుళ్లను ఎంత అభినందించినా తక్కువే.
This post was last modified on August 9, 2022 4:05 pm
నిత్యం పాఠశాలల్లోనూ.. జాతీయ పండుగల దినాల్లోనూ అందరూ కలసి పాడుకునే జాతీయ గేయం వందేమాతరం ఇక, చట్టబద్ధం కానుంది. దీనికి…
పరామర్శలు చేయడం తప్పుకాదు. పార్టీని కాపాడుకోవడమూ తప్పుకాదు. కానీ, ఎవరిని పరామర్శించాలన్న విషయంలోనే పార్టీలు విజ్ఞతతో ముందుకు సాగాలి. ఈ…
భారీ అంచనాలు కాదు కానీ ఘట్టమనేని ఫ్యామిలీ కావడంతో జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం మీద ఆడియన్స్ లో…
తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు…
చాన్నాళ్ల నుంచి భారతీయ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ప్రోమో రానే వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎపిక్స్లో ఒకటైన రామాయణం ఆధారంగా…
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…