మాములుగా స్టార్ హీరో క్యామియో అంటే ఒకప్పుడు షూటింగ్ స్టేజిలోనే పిచ్చ క్రేజ్ వచ్చేది. ఒకవేళ ఆ పాత్ర కనక సరిగ్గా పండితే కేవలం దాని వల్లే ఆయా సినిమాలు బ్లాక్ బస్టర్ లైన సందర్భాలున్నాయి. పెదరాయుడులో రజనీకాంత్ కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు. ఒసేయ్ రాములమ్మాలో కృష్ణ నటించినప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ దానికి అండగా నిలబడ్డారు. లారెన్స్ స్టైల్ లో పెద్ద హీరోలను కాసేపు వాడుకోవడం దానికెంత ప్లస్ అయ్యిందో అప్పట్లో థియేటర్లో చూసినవాళ్లకు గుర్తే. కానీ ఇప్పుడా స్థాయి ఎగ్జైట్ మెంట్ కనిపించడం లేదు.
అసలు విషయానికి వస్తే నాగ చైతన్య ప్రత్యేక పాత్ర చేసిన లాల్ సింగ్ చడ్డా ఇంకో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీర్ ఖాన్ దీని ప్రమోషన్ కోసమే ముంబై నుంచి హైదరాబాద్ కు కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ అటు ఇటు తిరుగుతూ ప్రీమియర్లు వేస్తున్నాడు. సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిరంజీవి సైతం ఎన్నడూ లేని రీతిలో ప్రత్యేకంగా పబ్లిసిటీలో భాగమవుతూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత అవుతున్నా ఈ మూవీకి ఉండాల్సిన స్థాయిలో బజ్ లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న బాయ్ కాట్ సంగతి తెలిసిందే
మరోవైపు తండ్రి నాగార్జున స్పెషల్ రోల్ చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ సైతం బజ్ కోసం కిందామీదా పడుతోంది. ఇటీవలే విడుదలైన కొన్ని బాలీవుడ్ గ్రాండియర్లు డిజాస్టరైన నేపథ్యంలో బయ్యర్ల ఆశలు, ప్రేక్షకుల భయాలన్నీ దీని మీదే ఉన్నాయి. బాహుబలి రేంజ్ లో జనాలు ఎగబడి ఎదురుచూస్తారనుకుంటే అంత సీన్ కనిపించడం లేదు. సెప్టెంబర్ 9 రిలీజ్ కు కేవలం 30 రోజుల సమయం మాత్రమే ఉంది. సో మరి చైతు నాగ్ లకూ ఇద్దరికీ ఎదురవుతున్న ఈ క్యామియోల పరీక్షను ఎలా ఎదురుకుని విజయం సాధిస్తారో చూడాలి.
This post was last modified on August 9, 2022 4:12 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…