ఈ శుక్రవారం రిలీజైన రెండు తెలుగు చిత్రాల్లో ‘బింబిసార’ తొలి రోజు సంచలన వసూళ్లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చివరగా ‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో డిజాస్టర్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. వశిష్ఠ అనే కొత్త దర్శకుడితో చేసిన సినిమాకు తొలి రోజు రూ.6.5 కోట్ల షేర్ రావడం చిన్న విషయం కాదు. అందులోనూ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు. దీంతో పోలిస్తే చాలా మంచి టాక్ తెచ్చుకున్న ‘సీతారామం’ వరల్డ్ వైడ్ వివిధ భాషల్లో కలిపి రూ.2.5 కోట్ల షేరే రాబట్టింది.
ఈ సినిమాకు వచ్చిన టాక్తో పోలిస్తే ఇవి తక్కువ వసూళ్లే. ఐతే ఇది పక్కా క్లాస్ మూవీ కావడం, ‘బింబిసార’ మాస్ను బాగా ఆకర్షించడం వల్ల దీని కలెక్షన్లు తగ్గాయి. కానీ పాజిటివ్ టాక్ బాగానే పని చేసినట్లు కనిపిస్తోంది. తొలి రోజు మార్నింగ్ షోలు, మ్యాట్నీలతో పోలిస్తే.. ఈవెనింగ్, నైట్ షోలకు మంచి స్పందన వచ్చింది. ఈ ఊపు రెండో రోజు కూడా కొనసాగింది. కలెక్షన్లలో బిగ్ జంప్ చోటు చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తొలి రోజుతో పోలిస్తే ‘సీతారామం’ వసూళ్లు పెరిగాయన్నది స్పష్టం. రెండో రోజు వరల్డ్ వైడ్ షేర్ రూ.4 కోట్ల దాకా ఉన్నట్లు అంచనా. తెలుగులో కంటే కూడా ఇతర భాషల్లో రెండో రోజు ‘సీతారామం’కు స్పందన పెరిగింది. తమిళంలో ఈ చిత్రాన్ని తొలి రోజు అసలు పట్టించుకోలేదు. కేవలం రూ.20 లక్షల షేర్ వచ్చింది. కానీ అక్కడి సమీక్షకులు సినిమాను అద్భుతం అంటూ కొనియాడారు. 4 రేటింగ్స్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ సినిమా గురించి గొప్పగా చెబుతుండటంతో రెండో రోజు తమిళ ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి పెరిగింది.
అక్కడ శనివారం రూ.80 లక్షల షేర్ రావడం విశేషం. ఆదివారం సినిమాకు హౌస్ ఫుల్స్ పడే అవకాశం కనిపిస్తోంది. దుల్కర్ సొంత భాష మలయాళంలోనూ సినిమా తొలి రోజుతో పోలిస్తే బాగా పుంజుకుంది. హిందీ జనాలు కూడా సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఇక యుఎస్లో ఈ చిత్రం అదరగొడుతోంది. వీకెండ్లోనే హాఫ్ మిలియన్ మార్కును అందుకునేలా కనిపిస్తోంది. సినిమాకు యునానమస్ పాజిటివ్ టాక్ ఉండడంతో చాలా రోజులు థియేటర్లలో ఉండి పెద్ద హిట్టే అవుతుందని భావిస్తున్నారు.
This post was last modified on August 7, 2022 7:17 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…