టాలీవుడ్ కు ఈ నెల బోణీ బాగుంది. రెండు విజయాలతో ప్రారంభం కావడంతో మిగిలినవి కూడా అదే దారి పడితే మళ్ళీ పుంజుకోవచ్చనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వచ్చే వారం ఎన్ని వస్తున్నాయన్నది పక్కనపెడితే అందరి చూపు 25న విడుదల కాబోతున్న లైగర్ మీదే ఉంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టేశాడు. ముంబై పూణే లాంటి నగరాలను ఈవెంట్ల కోసం రౌండ్ వేసేశాడు. తన కోసం వచ్చిన అభిమాన సందోహాన్ని చూసి అక్కడి మీడియా సైతం షాక్ అయ్యింది. ఇంటర్వ్యూలు గట్రా జోరుగా ఇస్తున్నాడు.
బిజినెస్ పరంగా లైగర్ ని హాట్ కేక్ లా అమ్మాలన్నది నిర్మాతల ప్లాన్. దానికి తగ్గట్టే కేవలం తెలుగు వెర్షనే 72 కోట్ల దాకా అమ్ముడుపోయినట్టు ఇన్ సైడ్ టాక్. వరంగల్ శ్రీనుకి లాక్ చేశారట. అఫీషియల్ కాలేదు కానీ లీకవుతున్న సోర్స్ చెబుతున్న సమాచారం గట్టిగానే ఉంది. మరోవైపు ఓవర్సీస్ హక్కులను 8 కోట్లకు విక్రయించినట్టు తెలిసింది. గత రెండు డిజాస్టర్లను చూస్తే విజయ్ దేవరకొండ మార్కెట్ కి మించి ఈ ధరలు పలకడం విశేషమే. హిందీ వెర్షన్ తాలూకు ప్రీ రిలీజ్ ట్రేడ్ లెక్కలు ఇంకా బయటికి రావాల్సి ఉంది
సరే జనం థియేటర్లకు వస్తున్నారు కదాని లైగర్ ని ఎగబడి చూస్తారని చెప్పలేం. అద్భుతంగా ఉందనే టాక్ వచ్చి, ఓసారైనా ఖచ్చితంగా చూడాలనే అభిప్రాయాలు వ్యక్తమైతే తప్ప ఇదంత సేఫ్ పెట్టుబడి కాదు. అయితే 70 కోట్లకు పైగా షేర్ రాబట్టడం చిన్న విషయం కాదు. కెజిఎఫ్ రేంజ్ లో హైప్ పెరగాలి. మరి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో ఊరమాస్ సెటప్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ లైగర్ ని తీర్చిదిద్దిన తీరు ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి. ఇప్పటిదాకా వదిలిన లిరికల్ వీడియోస్ వినడానికన్నా ఎక్కువ చూసేందుకు బాగున్నాయనే టాక్ తెచ్చుకున్నాయి. ట్రైలర్ కూడా మరీ మెస్మరైజ్ చేయలేదు కానీ మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.
This post was last modified on August 6, 2022 9:32 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…