చెప్పాపెట్టకుండా కొద్దిరోజుల ముందు ఆగస్ట్ 12 విడుదల తేదీని కన్ఫర్మ్ చేసుకున్న విరుమన్ తెలుగులో వస్తుందో రాదో ఇప్పటికీ క్లారిటీ లేదు. చెన్నైలో తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ ని సూర్య ముఖ్య అతిథిగా గ్రాండ్ గా చేశారు. చూస్తే ఇదీ రొటీన్ విలేజ్ మాస్ డ్రామాగానే రూపొందినట్టు కనిపిస్తోంది. గతంలో ఇలాంటివి కార్తీ చాలానే చేశాడు.
పరుత్తి వీరన్( మల్లిగాడు), చినబాబు, కొంబన్(డబ్ కాలేదు) ఇవన్నీ ఒకే టెంప్లేట్ లో సాగే పల్లెటూరి సినిమాలు. ఈ విరుమన్ కూడా అదే కోవలో కనిపిస్తోంది తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు. ఒక చిన్న పల్లెటూరు. అక్కడో పంచ కట్టుకుని ఊరంతా మాస్ గా చుట్టేసే అల్లరి హీరో. వెనుక ఒక కమెడియన్. స్వయానా కుటుంబ సభ్యుడైన ప్రకాష్ రాజ్ తో గొడవ, లోకల్ పంచాయితీలు, ఓ లవ్ స్టోరీ వెరసి రెగ్యులర్ గా ఇలాంటి డ్రామాల్లో ఉండే మసాలాలన్నీ దర్శకుడు ముత్తయ్య ఇందులో పొందుపరిచాడు.
డీ గ్లామర్ లుక్స్ తో హీరోయిన్ అదితి శంకర్ వెరైటీగా కనిపిస్తోంది. అప్పుడెప్పుడో ముని, పందెం కోడిలో చూసిన రాజ్ కిరణ్ తాతయ్య గెటప్ లో దర్శనమివ్వబోతున్నాడు. మొత్తానికి ఎలాంటి కొత్తదనం లేకుండా మేనేజ్ చేశారు. ఇంతకీ విరుమన్ తెలుగులో వస్తుందో లేదో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
తెలుగు హక్కులు ఎవరికీ ఇచ్చారో కన్ఫర్మేషన్ లేదు. ముఖ్యంగా కార్తీకి డబ్బింగ్ చెప్పుకునెందుకు టైం లేదు. చాలా హడావిడి పడాలి. పైగా లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2లు ఉన్న నేపథ్యంలో అసలు విరుమన్ ని ఇక్కడ రిలీజ్ చేస్తారో లేదో అనుమానమే. ఒకవేళ చేయకపోతే తర్వాత ఎవరూ పట్టించుకోకపోయే ప్రమాదం ఉంది. తమిళంలో హిట్ అయితే ఓకే. ఇక్కడ తీసుకురావచ్చు. తేడా కొట్టిందంటే మాత్రం డ్రాప్ అవ్వడం బెటర్. రేపో ఎల్లుండో తెలుగు వెర్షన్ కు సంబంధించిన స్పష్టత రావొచ్చు
This post was last modified on August 4, 2022 1:31 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…