ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆచార్య రూపంలో పెద్ద షాకే తిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ సినిమా తప్ప వేరే ఆలోచనలేవీ పెట్టుకోలేదు. దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్యాన్ ఇండియా మూవీని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దర్శకుడు శంకర్ ముందు వేగంగా పూర్తి చేస్తానని మాట ఇచ్చినప్పటికీ అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోలేకపోవడంతో 2023 సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్న టార్గెట్ కాస్తా తప్పని సరి పరిస్థితుల్లో మార్చుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా చరణ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే సంఘటన నిన్న జరిగిన విరుమన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. ఈ వేడుకకు సూర్యతో శంకర్ తదితర ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు.
తన స్పీచ్ లో భాగంగా సూర్య ఆర్ సి 15 ప్రస్తావన తెచ్చారు. దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకుడు శంకర్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెబుతూ తెలుగు తమిళం నుంచే కాక అన్ని రాష్ట్రాల అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రమిదని ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఇండియన్ 2ని కాదని దీని గురించే చెప్పడమంటే స్పెషలేగా.
అందుకే ఇప్పుడా ఎలివేషన్ తాలూకు వీడియో బైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిఎం(కామన్ మ్యాన్) టైటిల్ దీనికి పరిశీలనలో ఉన్నట్టు ఇప్పటికే లీక్స్ తిరుగుతున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంజలి, జయరాం, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో బాయ్స్ లో నటించి ఇప్పుడు శంకర్ సినిమాకే సంగీతమందిస్తున్న తమన్ మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇస్తున్నాడని టాక్.
This post was last modified on August 4, 2022 12:21 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…