ఆగస్ట్ 5న కళ్యాణ్ రామ్ తన ప్రతిష్టాత్మక సినిమా ‘బింబిసార’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి గట్టిగా ప్రమోషన్ చేస్తునాడు కళ్యాణ్ రామ్. కేవలం తెలుగులోనే రిలీజ్ కావడంతో తెలుగు మీడియాలో నిత్యం కనిపిస్తూ హంగామా చేస్తున్నాడు. అయితే కళ్యాణ్ కేవలం హీరో మాత్రమే కాదు. ఒక హీరో కూడా ఈ సినిమాకు హరి అనే వ్యక్తి నిర్మాతే కానీ బేనర్ కళ్యాణ్ రామ్ దే. ప్రస్తుతం టాలీవుడ్ లో షూటింగ్ స్ట్రైక్ నడుస్తోంది. ఈ విషయంపై కళ్యాణ్ రామ్ కి మీడియా నుండి ఓ ప్రశ్న ఎదురైంది.
దానికి కళ్యాణ్ రామ్ ఆన్సర్ ఇస్తూ ఇంకా ఆ స్ట్రైక్ గురించి తెలుసుకోలేదు ప్రెజెంట్ రిలీజ్ హడావుడిలో ఉన్నాను. నా సినిమా అయ్యాక అసలు సంగతి తెలుసుకొని మా నిర్మాతలతో చర్చిస్తాను అన్నాడు. ఇక తాజాగా ఈ విషయం గురించి నాతో సినిమాలు చేసే నిర్మాతలు వచ్చి కలుస్తా అంటే వద్దని చెప్పాను అంటూ కామెంట్స్ చేశాడు. ఇక బాలయ్య తో ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమా ఉంటుందని బాబాయ్ కి ఓ కథ చెప్పించాను కానీ ఆయనకి నచ్చలేదు నచ్చే కథ దొరికితే తప్పకుండా అయన సినిమా చేస్తారు అన్నాడు.
అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ లో తారక్ పార్ట్నర్ ఆ ? అనే విషయంపై కూడా కళ్యాణ్ రామ్ మాట్లాడాడు. తనకి తారక్ కి మధ్య లెక్కలు ఉండవని మేమంతా ఫ్యామిలీ అని చెప్పుకున్నాడు. బింబిసార విషయానికొస్తే ఇందులో యుద్దాలు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండవని ఇది జస్ట్ బింబిసారుడి కథతో తీసిన సినిమా మాత్రమే అని. కాకపోతే విటలాచార్య సినిమాలో ఉండే కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయని తెలిపాడు. మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను అభిమానులతో కలిసి బ్రమరాంబ ధియేటర్ లో ఉదయం షో చూస్తానని చెప్పాడు.
This post was last modified on August 3, 2022 9:59 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…