Movie News

తారక్ కి నాకు మధ్య లెక్కలుండవు

ఆగస్ట్ 5న కళ్యాణ్ రామ్ తన ప్రతిష్టాత్మక సినిమా ‘బింబిసార’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి గట్టిగా ప్రమోషన్ చేస్తునాడు కళ్యాణ్ రామ్. కేవలం తెలుగులోనే రిలీజ్ కావడంతో తెలుగు మీడియాలో నిత్యం కనిపిస్తూ హంగామా చేస్తున్నాడు. అయితే కళ్యాణ్ కేవలం హీరో మాత్రమే కాదు. ఒక హీరో కూడా ఈ సినిమాకు హరి అనే వ్యక్తి నిర్మాతే కానీ బేనర్ కళ్యాణ్ రామ్ దే. ప్రస్తుతం టాలీవుడ్ లో షూటింగ్ స్ట్రైక్ నడుస్తోంది. ఈ విషయంపై కళ్యాణ్ రామ్ కి మీడియా నుండి ఓ ప్రశ్న ఎదురైంది.

దానికి కళ్యాణ్ రామ్ ఆన్సర్ ఇస్తూ ఇంకా ఆ స్ట్రైక్ గురించి తెలుసుకోలేదు ప్రెజెంట్ రిలీజ్ హడావుడిలో ఉన్నాను. నా సినిమా అయ్యాక అసలు సంగతి తెలుసుకొని మా నిర్మాతలతో చర్చిస్తాను అన్నాడు. ఇక తాజాగా ఈ విషయం గురించి నాతో సినిమాలు చేసే నిర్మాతలు వచ్చి కలుస్తా అంటే వద్దని చెప్పాను అంటూ కామెంట్స్ చేశాడు. ఇక బాలయ్య తో ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమా ఉంటుందని బాబాయ్ కి ఓ కథ చెప్పించాను కానీ ఆయనకి నచ్చలేదు నచ్చే కథ దొరికితే తప్పకుండా అయన సినిమా చేస్తారు అన్నాడు.

అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ లో తారక్ పార్ట్నర్ ఆ ? అనే  విషయంపై కూడా కళ్యాణ్ రామ్ మాట్లాడాడు. తనకి తారక్ కి మధ్య లెక్కలు ఉండవని మేమంతా ఫ్యామిలీ అని చెప్పుకున్నాడు. బింబిసార విషయానికొస్తే ఇందులో యుద్దాలు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండవని ఇది జస్ట్ బింబిసారుడి కథతో తీసిన సినిమా మాత్రమే అని. కాకపోతే విటలాచార్య సినిమాలో ఉండే కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయని తెలిపాడు. మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను అభిమానులతో కలిసి బ్రమరాంబ ధియేటర్ లో ఉదయం షో చూస్తానని చెప్పాడు.

This post was last modified on August 3, 2022 9:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago