ఆగస్ట్ 5న కళ్యాణ్ రామ్ తన ప్రతిష్టాత్మక సినిమా ‘బింబిసార’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి గట్టిగా ప్రమోషన్ చేస్తునాడు కళ్యాణ్ రామ్. కేవలం తెలుగులోనే రిలీజ్ కావడంతో తెలుగు మీడియాలో నిత్యం కనిపిస్తూ హంగామా చేస్తున్నాడు. అయితే కళ్యాణ్ కేవలం హీరో మాత్రమే కాదు. ఒక హీరో కూడా ఈ సినిమాకు హరి అనే వ్యక్తి నిర్మాతే కానీ బేనర్ కళ్యాణ్ రామ్ దే. ప్రస్తుతం టాలీవుడ్ లో షూటింగ్ స్ట్రైక్ నడుస్తోంది. ఈ విషయంపై కళ్యాణ్ రామ్ కి మీడియా నుండి ఓ ప్రశ్న ఎదురైంది.
దానికి కళ్యాణ్ రామ్ ఆన్సర్ ఇస్తూ ఇంకా ఆ స్ట్రైక్ గురించి తెలుసుకోలేదు ప్రెజెంట్ రిలీజ్ హడావుడిలో ఉన్నాను. నా సినిమా అయ్యాక అసలు సంగతి తెలుసుకొని మా నిర్మాతలతో చర్చిస్తాను అన్నాడు. ఇక తాజాగా ఈ విషయం గురించి నాతో సినిమాలు చేసే నిర్మాతలు వచ్చి కలుస్తా అంటే వద్దని చెప్పాను అంటూ కామెంట్స్ చేశాడు. ఇక బాలయ్య తో ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమా ఉంటుందని బాబాయ్ కి ఓ కథ చెప్పించాను కానీ ఆయనకి నచ్చలేదు నచ్చే కథ దొరికితే తప్పకుండా అయన సినిమా చేస్తారు అన్నాడు.
అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ లో తారక్ పార్ట్నర్ ఆ ? అనే విషయంపై కూడా కళ్యాణ్ రామ్ మాట్లాడాడు. తనకి తారక్ కి మధ్య లెక్కలు ఉండవని మేమంతా ఫ్యామిలీ అని చెప్పుకున్నాడు. బింబిసార విషయానికొస్తే ఇందులో యుద్దాలు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండవని ఇది జస్ట్ బింబిసారుడి కథతో తీసిన సినిమా మాత్రమే అని. కాకపోతే విటలాచార్య సినిమాలో ఉండే కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయని తెలిపాడు. మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను అభిమానులతో కలిసి బ్రమరాంబ ధియేటర్ లో ఉదయం షో చూస్తానని చెప్పాడు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…