రాధేశ్యామ్ ప్రి రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎక్కడా కనిపించలేదు ప్రభాస్. తన సినిమాల కబుర్లు కూడా పెద్దగా ఏమీ వినిపించడం లేదు. ఇలాంటి టైంలో సీతారామం ప్రి రిలీజ్ ఈవెంట్కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. ముందు ప్రభాస్ ఈ ఈవెంట్కు రావడంపై నిర్మాత అశ్వినీదత్ సందేహాలు వ్యక్తం చేశారు కానీ.. తర్వాత యంగ్ రెబల్ స్టార్ రాక ఖరారైంది.
ఇది ప్రభాస్ అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే కానీ.. వాళ్లు ప్రత్యక్షంగా ప్రభాస్ను చూసే అవకాశం మాత్రం లేనట్లే అని సమాచారం. ఈ వేడుకను ఎప్పుడూ ఈవెంట్లు జరిగే పెద్ద ఆడిటోరియాల్లో చేయట్లేదని సమాచారం. హైదరాబాద్లోని ఒక స్టూడియోలోని చిన్న ప్రాంగణంలో మీడియా, కొందరు సినీ ప్రముఖుల మధ్య ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం.
దీనికి సాధారణ అభిమానులను అనుమతించబోరట. ఎంపిక చేసిన కొందరు మాత్రం ఈవెంట్లో పాల్గొంటారట.ఇటీవల బింబిసార ప్రి రిలీజ్ ఈవెంట్లో చోటు చేసుకున్న విషాదమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఆ వేడుక సందర్భంగా ఒక అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అతడి మరణానికి కారణాలేంటనే విషయమై రకరకాల ఊహాగానాలు సాగాయి.
గతంలో చాలాసార్లు ఫిలిం ఈవెంట్లలో ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో అనుమతుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా, జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభాస్ ఫిలిం ఈవెంట్కు వస్తున్నాడంటే పెద్ద ఎత్తున అభిమానులు అతణ్ని చూసేందుకు ఎగబడతారు. బింబిసార ఈవెంట్కు సంబంధించిన విషాద ఘటన నేపథ్యంలో ఈ టైంలో అభిమానులను అనుమతించి మళ్లీ ఏదైనా ప్రతికూల ఘటన చోటు చేసుకుంటే కష్టమన్న ఉద్దేశంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on August 3, 2022 1:24 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…