రాధేశ్యామ్ ప్రి రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎక్కడా కనిపించలేదు ప్రభాస్. తన సినిమాల కబుర్లు కూడా పెద్దగా ఏమీ వినిపించడం లేదు. ఇలాంటి టైంలో సీతారామం ప్రి రిలీజ్ ఈవెంట్కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. ముందు ప్రభాస్ ఈ ఈవెంట్కు రావడంపై నిర్మాత అశ్వినీదత్ సందేహాలు వ్యక్తం చేశారు కానీ.. తర్వాత యంగ్ రెబల్ స్టార్ రాక ఖరారైంది.
ఇది ప్రభాస్ అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే కానీ.. వాళ్లు ప్రత్యక్షంగా ప్రభాస్ను చూసే అవకాశం మాత్రం లేనట్లే అని సమాచారం. ఈ వేడుకను ఎప్పుడూ ఈవెంట్లు జరిగే పెద్ద ఆడిటోరియాల్లో చేయట్లేదని సమాచారం. హైదరాబాద్లోని ఒక స్టూడియోలోని చిన్న ప్రాంగణంలో మీడియా, కొందరు సినీ ప్రముఖుల మధ్య ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం.
దీనికి సాధారణ అభిమానులను అనుమతించబోరట. ఎంపిక చేసిన కొందరు మాత్రం ఈవెంట్లో పాల్గొంటారట.ఇటీవల బింబిసార ప్రి రిలీజ్ ఈవెంట్లో చోటు చేసుకున్న విషాదమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఆ వేడుక సందర్భంగా ఒక అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అతడి మరణానికి కారణాలేంటనే విషయమై రకరకాల ఊహాగానాలు సాగాయి.
గతంలో చాలాసార్లు ఫిలిం ఈవెంట్లలో ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో అనుమతుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా, జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభాస్ ఫిలిం ఈవెంట్కు వస్తున్నాడంటే పెద్ద ఎత్తున అభిమానులు అతణ్ని చూసేందుకు ఎగబడతారు. బింబిసార ఈవెంట్కు సంబంధించిన విషాద ఘటన నేపథ్యంలో ఈ టైంలో అభిమానులను అనుమతించి మళ్లీ ఏదైనా ప్రతికూల ఘటన చోటు చేసుకుంటే కష్టమన్న ఉద్దేశంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on August 3, 2022 1:24 pm
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…