నెపోటిజం, బంధుప్రీతి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు హాట్ టాపిక్ అయింది. సుశాంత్ సింగ్ రాజపుత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది ఎవరికీ తెలియకపోయినా కానీ దానికి బాలీవుడ్ లో పెరిగిపోయిన నెపోటిజం కారణమని తేల్చేసారు కీబోర్డ్ వారియర్స్. వాళ్లకు కంగనా రనౌత్ లాంటి వాళ్ళ వత్తాసు దొరికింది. బాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్లు ఎక్కువగా సినీ ఫ్యామిలీస్ నుంచే వస్తుంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల వారసులు వస్తుంటారు కానీ అమ్మాయిలను సినిమాల్లోకి పంపించరు. ఒకటీ అరా ఉదాహరణలు మినహా హీరోయిన్లకు వారసురాళ్ల నుంచి పోటీ ఏమీ ఉండదు. అయితే మన మీడియా కామెడీగా నెపోటిజం సమస్య గురించి మన హీరోయిన్లను అడుగుతోంది. వాళ్ళు కూడా దక్షిణాదిలో హీరోయిన్లకు ఆ సమస్య లేదని అనకుండా తోచిన సమాధానాలు చెప్పేస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజపుత్ కి సన్నిహితులు సైలెంట్ గా వుంటే.. ఎప్పుడో ఒకసారి అతనితో ఫోటో దిగిన వాళ్ళు, ఏదైనా పార్టీలో కలిసిన వాళ్ళు అతనితో ఉన్న స్మృతులు నెమరు వేసుకుని ట్రెండ్ క్యాష్ చేసుకోవడం రివాజు అయిపోయింది.
This post was last modified on July 3, 2020 7:45 am
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…