KGF ఇచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ హీరో యష్ ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుకాలేదు. కన్నడలో మఫ్టీ లాంటి సూపర్ హిట్ మల్టీ స్టారర్ ఇచ్చిన నర్తన్ దర్శకత్వంలో చేయడం కన్ఫర్మ్ అయ్యిందని అప్పట్లో బెంగళూరు మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. తీరా చూస్తే అదింకా మొదలుకానే లేదు. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఎవరికీ తెలియదు.
శంకర్, పూరి జగన్నాధ్ లాంటి పేర్లు తొలుత వినిపించాయి కానీ ఇప్పుడా ఛాన్సెస్ కూడా క్రమంగా తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి యష్ ఈ విషయంలో ప్రభాస్ ని స్ఫూర్తిగా తీసుకుంటే బెటర్. ఎందుకంటే బాహుబలి టైంలో ఇలాంటి ప్రెజరే వచ్చినప్పుడు డార్లింగ్ రిస్క్ చేసి మరీ కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్, రాధాకృష్ణలకు ఆఫర్ ఇచ్చాడు.
అఫ్కోర్స్ వాటి ఫలితాలు తేడా కొట్టినప్పటికీ దాని వల్ల ఇమేజ్ కు వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. అందుకే ఇప్పుడు ఒకేసారి ఏకంగా అయిదారు సినిమాలు లైన్ లో పెట్టేసి ఎడతెరిపి లేకుండా షూటింగ్స్ లో బిజీ అవుతున్నాడు. ఇందులో గన్ షాట్ గా ఏవి బ్లాక్ బస్టర్స్ అవుతాయో తనకూ తెలియదు.
ఇలా చేయడం తప్ప యష్ కు మరో ఆప్షన్ లేదు. ఏ హీరోకైనా ఈ దశ తప్పదు. మగధీర తర్వాత రామ్ చరణ్, సింహాద్రి అయ్యాక జూనియర్ ఎన్టీఆర్, ఒక్కడు దెబ్బకు మహేష్ బాబు, ఆర్య తర్వాత అల్లు అర్జున్ ఇలా అందరూ ఈ స్టేజిని అయోమయాన్ని దాటిన వాళ్లే. అంతే తప్ప ఎక్కువ వేచిచూసే కొద్దీ టైం వేస్ట్ అవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇరవై ఏళ్ళ క్రితం ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన యష్ కు ఇప్పుడు పన్నెండు వందల కోట్ల సినిమా వచ్చాక ఇలాంటి పరిస్థితి కలగడం సహజం. అలా అని జాప్యం చేస్తూ కూర్చుంటే ఒరిగే ప్రయోజనం కూడా ఏమీ లేదుగా..
This post was last modified on August 3, 2022 12:19 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…