KGF ఇచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ హీరో యష్ ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుకాలేదు. కన్నడలో మఫ్టీ లాంటి సూపర్ హిట్ మల్టీ స్టారర్ ఇచ్చిన నర్తన్ దర్శకత్వంలో చేయడం కన్ఫర్మ్ అయ్యిందని అప్పట్లో బెంగళూరు మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. తీరా చూస్తే అదింకా మొదలుకానే లేదు. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఎవరికీ తెలియదు.
శంకర్, పూరి జగన్నాధ్ లాంటి పేర్లు తొలుత వినిపించాయి కానీ ఇప్పుడా ఛాన్సెస్ కూడా క్రమంగా తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి యష్ ఈ విషయంలో ప్రభాస్ ని స్ఫూర్తిగా తీసుకుంటే బెటర్. ఎందుకంటే బాహుబలి టైంలో ఇలాంటి ప్రెజరే వచ్చినప్పుడు డార్లింగ్ రిస్క్ చేసి మరీ కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్, రాధాకృష్ణలకు ఆఫర్ ఇచ్చాడు.
అఫ్కోర్స్ వాటి ఫలితాలు తేడా కొట్టినప్పటికీ దాని వల్ల ఇమేజ్ కు వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. అందుకే ఇప్పుడు ఒకేసారి ఏకంగా అయిదారు సినిమాలు లైన్ లో పెట్టేసి ఎడతెరిపి లేకుండా షూటింగ్స్ లో బిజీ అవుతున్నాడు. ఇందులో గన్ షాట్ గా ఏవి బ్లాక్ బస్టర్స్ అవుతాయో తనకూ తెలియదు.
ఇలా చేయడం తప్ప యష్ కు మరో ఆప్షన్ లేదు. ఏ హీరోకైనా ఈ దశ తప్పదు. మగధీర తర్వాత రామ్ చరణ్, సింహాద్రి అయ్యాక జూనియర్ ఎన్టీఆర్, ఒక్కడు దెబ్బకు మహేష్ బాబు, ఆర్య తర్వాత అల్లు అర్జున్ ఇలా అందరూ ఈ స్టేజిని అయోమయాన్ని దాటిన వాళ్లే. అంతే తప్ప ఎక్కువ వేచిచూసే కొద్దీ టైం వేస్ట్ అవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇరవై ఏళ్ళ క్రితం ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన యష్ కు ఇప్పుడు పన్నెండు వందల కోట్ల సినిమా వచ్చాక ఇలాంటి పరిస్థితి కలగడం సహజం. అలా అని జాప్యం చేస్తూ కూర్చుంటే ఒరిగే ప్రయోజనం కూడా ఏమీ లేదుగా..
This post was last modified on August 3, 2022 12:19 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…