ఇంకా ఫస్ట్ లుక్ రాలేదు, ప్రభాస్ ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడో కనీసం క్లూ కూడా ఇవ్వలేదు అయినా కూడా ఆది పురుష్ అప్పుడే సెన్సేషన్లు మొదలు పెట్టేసింది. రెండు డిజాస్టర్లు బ్యాక్ టు బ్యాక్ పలకరించినా తన మార్కెట్ లో, బ్రాండ్ లో ఎలాంటి మార్పు రాలేదని డార్లింగ్ పదే పదే ఋజువు చేస్తూనే ఉన్నాడు.
సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ అతిథిగా వస్తున్నాడన్న వార్త ఏకంగా ఆ సినిమాని సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి తీసుకెళ్ళిందంటేనే అభిమానులతో పాటు ఆడియెన్స్ తనను ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆది పురుష్ కు సంబందించిన డిజిటల్ డీల్ ని అన్ని భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ 250 కోట్లకు కొనేసిందని ముంబై మీడియాలో పెద్ద టాకే నడుస్తోంది. ఇప్పటిదాకా ఇది ఏ ఇండియన్ సినిమాకు సాధ్యపడలేదు.
అందులోనూ రామాయణగాధను ఆధారంగా చేసుకున్న మైథలాజికల్ సబ్జెక్టు మీద ఒక అంతర్జాతీయ ఓటిటి ఇంత మొత్తంలో పెట్టుబడికి ముందు రావడం నిజంగా గొప్ప విషయం. ఆది పురుష్ ను తీస్తోంది హిందీ దర్శకుడు ఓం రౌత్ అయినప్పటికీ ప్రభాస్ హీరో కావడం వల్లే దీనికింత రేంజ్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఇంత రిస్క్ చేయడానికి కారణం లేకపోలేదు.
ఇటీవలే స్ట్రీమ్ చేసిన ఆర్ఆర్ఆర్ కేవలం హిందీ వెర్షన్ నుంచే ఊహించని స్థాయిలో అత్యద్భుతమైన రీతిలో గ్లోబల్ రీచ్ సాధించింది. మర్వెల్ లో ఎన్నో సూపర్ హీరోస్ సినిమాలు తీసిన దర్శకులు సైతం రాజమౌళి ప్రతిభకు సాహో అన్నారు. సో వాళ్ళకు మన సత్తా ఏంటో అర్థమైపోయింది. పైగా తానాజీని ఓం రౌత్ తీర్చిద్దిద్దిన విధానం చూశాక ఆది పురుష్ మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. అఫీషియల్ స్టేట్ మెంట్ రాలేదు కానీ ఈ ఒప్పందం లాక్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం
This post was last modified on August 3, 2022 10:30 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…