ఇంకా ఫస్ట్ లుక్ రాలేదు, ప్రభాస్ ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడో కనీసం క్లూ కూడా ఇవ్వలేదు అయినా కూడా ఆది పురుష్ అప్పుడే సెన్సేషన్లు మొదలు పెట్టేసింది. రెండు డిజాస్టర్లు బ్యాక్ టు బ్యాక్ పలకరించినా తన మార్కెట్ లో, బ్రాండ్ లో ఎలాంటి మార్పు రాలేదని డార్లింగ్ పదే పదే ఋజువు చేస్తూనే ఉన్నాడు.
సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ అతిథిగా వస్తున్నాడన్న వార్త ఏకంగా ఆ సినిమాని సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి తీసుకెళ్ళిందంటేనే అభిమానులతో పాటు ఆడియెన్స్ తనను ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆది పురుష్ కు సంబందించిన డిజిటల్ డీల్ ని అన్ని భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ 250 కోట్లకు కొనేసిందని ముంబై మీడియాలో పెద్ద టాకే నడుస్తోంది. ఇప్పటిదాకా ఇది ఏ ఇండియన్ సినిమాకు సాధ్యపడలేదు.
అందులోనూ రామాయణగాధను ఆధారంగా చేసుకున్న మైథలాజికల్ సబ్జెక్టు మీద ఒక అంతర్జాతీయ ఓటిటి ఇంత మొత్తంలో పెట్టుబడికి ముందు రావడం నిజంగా గొప్ప విషయం. ఆది పురుష్ ను తీస్తోంది హిందీ దర్శకుడు ఓం రౌత్ అయినప్పటికీ ప్రభాస్ హీరో కావడం వల్లే దీనికింత రేంజ్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఇంత రిస్క్ చేయడానికి కారణం లేకపోలేదు.
ఇటీవలే స్ట్రీమ్ చేసిన ఆర్ఆర్ఆర్ కేవలం హిందీ వెర్షన్ నుంచే ఊహించని స్థాయిలో అత్యద్భుతమైన రీతిలో గ్లోబల్ రీచ్ సాధించింది. మర్వెల్ లో ఎన్నో సూపర్ హీరోస్ సినిమాలు తీసిన దర్శకులు సైతం రాజమౌళి ప్రతిభకు సాహో అన్నారు. సో వాళ్ళకు మన సత్తా ఏంటో అర్థమైపోయింది. పైగా తానాజీని ఓం రౌత్ తీర్చిద్దిద్దిన విధానం చూశాక ఆది పురుష్ మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. అఫీషియల్ స్టేట్ మెంట్ రాలేదు కానీ ఈ ఒప్పందం లాక్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం
This post was last modified on August 3, 2022 10:30 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…