Movie News

నేనింతే సీన్ రిపీట్ అయ్యింది

నిన్న విడుదలైన రామారావు ఆన్ డ్యూటీకి వస్తున్న స్పందన తెలిసిందే. రవితేజ ఎంత నమ్మకం పెట్టుకున్నప్పటికీ కనీసం అభిమానులనైనా సంతృప్తి పరిచేలా సినిమా లేకపోవడంతో మాస్ మహారాజాకు మరో చేదు ఫలితం తప్పలేదు వీకెండ్ రెండు రోజులు ఎంత వస్తే దాని మీదే మాగ్జిమమ్ ఆధారపడే పరిస్థితి నెలకొంది. ఇప్పుడీ టాక్ కి వచ్చే వారం రాబోతున్న బింబిసార- సీతారామంల పోటీని తట్టుకుని నిలవడం కష్టంగానే కనిపిస్తోంది. థాంక్ యు చేదు జ్ఞాపకాలు మరిచిపోకముందే ట్రేడ్ కి మరో షాక్ తగిలింది.

ఇదిలా ఉండగా రిలీజ్ రోజు ప్రసాద్ ఐమ్యాక్స్ బయట తమ హీరోల సినిమాలు ఎలా ఉన్నా ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకోవడం మాములే. యూట్యూబ్ ఛానెల్స్ ఈ వీడియోలనే వ్యూస్ కోసం ఆదాయ మార్గాలుగా మార్చుకున్నాయి. అయితే రామారావు ఆన్ డ్యూటీ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. దర్శకుడు శరత్ మండవని ఉద్దేశించి కొందరు ఫ్యాన్స్ నేనింతేలో సాయిరామ్ శంకర్ స్టయిల్ లో థియేటర్ వైపు రాకండని, వస్తే మూకుమ్మడిగా నిలదీస్తామని బాధ కోపం రెండూ కలగలిసిన ఫీలింగ్స్ ని బయటపెట్టేశారు.

నేనింతే రిలీజ్ టైంలోనే కాదు ఇప్పటికీ అది ఐకానిక్ సీన్ నిలిచిపోయింది., వాస్తవ పరిస్థితులను అద్దం పట్టే విధంగా పూరి జగన్నాధ్ దర్శకుడు పాత్రలో బ్రహ్మానందంతో చేయించిన కామెడీ ఓ రేంజ్ లో పేలింది. ఇప్పుడా సంఘటనే ఇన్నేళ్ల తర్వాత నిజంగానే రిపీట్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రవితేజకు ఫ్లాప్ చూడటం కొత్తేమి కాదు కానీ క్రాక్ తో కంబ్యాక్ అయ్యాక ఖిలాడీ దెబ్బ కొట్టాక రామారావు ఆన్ డ్యూటీ మళ్ళీ బ్రేక్ ఇస్తుందేమోనని ఆశిస్తే ఇలా జరిగిపోయింది. ఇకపై మాస్ మహారాజా స్పీడ్ కన్నా ముఖ్యంగా కంటెంట్ మీద దృష్టి పెట్టాల్సిన టైం వచ్చేసింది.

This post was last modified on July 30, 2022 1:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago