Movie News

చైతూతో ఉన్న ఇంటిని కొనేసిన సమంత

తెలుగులో తన తొలి చిత్ర హీరో అయిన అక్కినేని నాగచైతన్యతో.. కొన్నేళ్ల తర్వాత ప్రేమలో పడింది సమంత. అతనూ ఆమెను ఇష్టపడి కొన్నాళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట.. ఐదేళ్ల కిందట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. అప్పుడా జంటను చూసి ముచ్చట పడని వారు లేరు. చైతూ, సామ్ అభిమానులే కాక అందరికీ ఆ జంట చాలా ముచ్చటగా అనిపించింది. ఈ జంట ఎప్పటికీ ఇలాగే ఉండాలని అంతా కోరుకున్నారు. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి కథ మారిపోయింది. అందరికీ షాకిస్తూ.. చైతూ, సామ్ జంట విడాకులు తీసుకుంది.

ఈ వ్యవహారం మీద నెలల తరబడి చర్చ జరగడం తెలిసిందే. ఇంకా కూడా ఆ చర్చకు తెరపడడం లేదు. ఏదో విధంగా చైతూ-సామ్ బంధం చర్చకు వస్తూనే ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. గతంలో తాను నిర్మించిన అపార్ట్‌మెంట్లోని ఒక ఫ్లాట్‌ చూసి ఎంత ముచ్చట పడడం. తాను ఇవ్వనన్నా కూడా నాగార్జున సాయంతో దాన్ని కొనడం.. అందులో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ జంట చివరికి విడిపోయి తనను షాక్‌కు గురి చేయడం గురించి వెల్లడించారు.

కాగా తాజాగా మురళీ మోహన్ ఈ ఇంటి గురించి ఇంకో ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ ఇంటిని వద్దనుకుని వెళ్లిపోయాక.. తిరిగి సమంత దాన్ని సొంతం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విడాకుల తర్వాత సమంత వేరే ఇంటికి వెళ్లినా సౌకర్యంగా లేకపోవడం, వేరే ఇళ్లు చూసి సంతృప్తి చెందకపోవడంతో తిరిగి ఆ ఇంటినే కొనుక్కుందని మురళీ మోహన్ చెప్పారు.

మధ్యలో ఆ ఇంటిని వేరే వాళ్లు కొనుక్కున్నారని.. సమంత అడిగినా తాను చేయగలిగిందేమీ లేదని చెప్పానని.. కానీ ఇంత మంచి ఇల్లు తనకు ఇంకెక్కడా దొరకడం లేదని సమంత అనడంతో దాని ఓనర్‌తో మాట్లాడించినట్లు ఆయన తెలిపారు. ఇంతకుముందు అమ్మిన రేటు మీద లాభం ఇచ్చి తిరిగి సమంత ఆ ఇంటిని సొంతం చేసుకుందని మురళీ మోహన్ చెప్పారు. ప్రస్తుతం సమంత తన తల్లితో కలిసి ఆ ఇంట్లో ఉంటోందన్నారు. సమంతకు నాగచైతన్య ఆ ఇంటిని రాసిచ్చినట్లు సోషల్ మీడియాలో గతంలో ప్రచారం జరగ్గా.. అలాంటిదేమీ లేదనడానికి మురళీ మోహన్ మాటలే రుజువంటూ సమంత అభిమానులు ఈ ప్రచారం చేసిన వారికి కౌంటర్ ఇస్తున్నారిప్పుడు.

This post was last modified on July 29, 2022 6:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

13 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago