తెలుగులో తన తొలి చిత్ర హీరో అయిన అక్కినేని నాగచైతన్యతో.. కొన్నేళ్ల తర్వాత ప్రేమలో పడింది సమంత. అతనూ ఆమెను ఇష్టపడి కొన్నాళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట.. ఐదేళ్ల కిందట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. అప్పుడా జంటను చూసి ముచ్చట పడని వారు లేరు. చైతూ, సామ్ అభిమానులే కాక అందరికీ ఆ జంట చాలా ముచ్చటగా అనిపించింది. ఈ జంట ఎప్పటికీ ఇలాగే ఉండాలని అంతా కోరుకున్నారు. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి కథ మారిపోయింది. అందరికీ షాకిస్తూ.. చైతూ, సామ్ జంట విడాకులు తీసుకుంది.
ఈ వ్యవహారం మీద నెలల తరబడి చర్చ జరగడం తెలిసిందే. ఇంకా కూడా ఆ చర్చకు తెరపడడం లేదు. ఏదో విధంగా చైతూ-సామ్ బంధం చర్చకు వస్తూనే ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. గతంలో తాను నిర్మించిన అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్ చూసి ఎంత ముచ్చట పడడం. తాను ఇవ్వనన్నా కూడా నాగార్జున సాయంతో దాన్ని కొనడం.. అందులో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ జంట చివరికి విడిపోయి తనను షాక్కు గురి చేయడం గురించి వెల్లడించారు.
కాగా తాజాగా మురళీ మోహన్ ఈ ఇంటి గురించి ఇంకో ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ ఇంటిని వద్దనుకుని వెళ్లిపోయాక.. తిరిగి సమంత దాన్ని సొంతం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విడాకుల తర్వాత సమంత వేరే ఇంటికి వెళ్లినా సౌకర్యంగా లేకపోవడం, వేరే ఇళ్లు చూసి సంతృప్తి చెందకపోవడంతో తిరిగి ఆ ఇంటినే కొనుక్కుందని మురళీ మోహన్ చెప్పారు.
మధ్యలో ఆ ఇంటిని వేరే వాళ్లు కొనుక్కున్నారని.. సమంత అడిగినా తాను చేయగలిగిందేమీ లేదని చెప్పానని.. కానీ ఇంత మంచి ఇల్లు తనకు ఇంకెక్కడా దొరకడం లేదని సమంత అనడంతో దాని ఓనర్తో మాట్లాడించినట్లు ఆయన తెలిపారు. ఇంతకుముందు అమ్మిన రేటు మీద లాభం ఇచ్చి తిరిగి సమంత ఆ ఇంటిని సొంతం చేసుకుందని మురళీ మోహన్ చెప్పారు. ప్రస్తుతం సమంత తన తల్లితో కలిసి ఆ ఇంట్లో ఉంటోందన్నారు. సమంతకు నాగచైతన్య ఆ ఇంటిని రాసిచ్చినట్లు సోషల్ మీడియాలో గతంలో ప్రచారం జరగ్గా.. అలాంటిదేమీ లేదనడానికి మురళీ మోహన్ మాటలే రుజువంటూ సమంత అభిమానులు ఈ ప్రచారం చేసిన వారికి కౌంటర్ ఇస్తున్నారిప్పుడు.
This post was last modified on July 29, 2022 6:50 pm
ఇటీవలే విడుదలైన దిల్ రుబా కిరణ్ అబ్బవరంకు పెద్ద షాకే ఇచ్చింది. ముందు రోజు సాయంత్రం ప్రీమియర్ షో నుంచే…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం…
రాజకీయాల్లో కొందరు నేతల తీరు విభిన్నంగా ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారు ఎంతదాకా అయినా వెళతారు. ఈ…
నిజమే… తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి యావత్తు రాష్ట్రాన్ని గెలిచారు. అదేంటీ… 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ…
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి సోమవారం మరో షాక్ తగిలింది. ఇప్పటికే గుంటూరు…
టాలీవుడ్లో దాదాపు 25 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు సీనియర్ నటుడు శివాజీ. కెరీర్ ఆరంభంలో సహాయ పాత్రలు చేసిన అతను..…