అదేంటో బాలీవుడ్ జనాలు మరీ సున్నితంగా మారిపోతున్నారు. ఒక సినిమాని ప్రేక్షకులు తిరస్కరిస్తే దానికి కారణాలు ఏంటని విశ్లేషించుకోకుండా కొత్త అర్థాలు తీసి నయా ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే విడుదలైన షంషేరా బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణంగా బోల్తా కొట్టిందో చూశాం. కేవలం మూడో రోజుకే జనం లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. నూటా యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో యష్ రాజ్ లాంటి సుప్రసిద్ధ సంస్థ తీసిన ఈ విజువల్ గ్రాండియర్ కు ఇంత దారుణ పరాభవం ఊహించనిది.
సరే జరిగిందేదో జరిగింది ఇలాంటి వస్తుంటాయి పోతుంటాయని వదిలేయకుండా దర్శకుడు కరణ్ మల్హోత్రా, ఇందులో విలన్ గా సంజయ్ దత్ కు ఈ పరాజయానికి వెరైటీ భాష్యం చెబుతున్నారు. కొందరు అకారణంగా షంషేరా మీద ద్వేషం పెంచుకున్నారని, చూడని వాళ్ళు సైతం నెగటివిటీ పంచడానికి పూనుకున్నారని, మేము పడ్డ కష్టాన్ని గుర్తించకుండా ఇంత విషాన్ని చిమ్మడం బాధ కలిగించిందని ట్విట్టర్ వేదికగా చాంతాడంత మెసేజులు పెట్టారు. దీనికి సానుభూతి రాకపోగా నెటిజెన్లు రివర్స్ కౌంటర్లు ఇవ్వడం అసలు ట్విస్ట్.
తీసిందే నాసిరకరం కంటెంట్. దాన్ని నిజాయితీగా ఒప్పేసుకుని మరోసారి ఇలా చేయమంటే సరిపోయేదానికి ద్వేషం లాంటి పెద్ద పదాలు వాడటం ఏమిటో అంతు చిక్కడం లేదు. హృతిక్ రోషన్ తో అగ్నిపథ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నుంచి ఇలాంటి అవుట్ ఫుట్ ని ఎవరు ఆశిస్తారు. సహజంగానే అసంతృప్తి కొంత ఎక్కువ మోతాదులో బయటికి వచ్చింది. సంజయ్ దత్ చేసిన ఓవరాక్షనే షంషేరా ప్రధాన మైనస్సులో ఒకటిగా ఉంది. అయినా ఇలా చేయడం ద్వారా సింపతీ రావడం ఏమో కానీ ఉన్న పరపతి పోయేలా ఉంది .
This post was last modified on July 29, 2022 9:45 am
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
రాష్ట్రంలోని కూటమి సర్కారు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను మాత్రమే భర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్రమంలో సీఎం విచక్షణ…
"రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయన మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నా" ఓ 15 ఏళ్ల కిందట కర్ణాటకలో జరిగిన రాజకీయం…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుట్టూ బీజేపీకి చెందిన హేమాహేమీలు ఉంటారు. దాదాపుగా వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…