అంతా అనుకున్నట్లు జరిగితే ఇంకో రెండు వారాల్లో ‘ఏజెంట్’ సినిమా విడుదల కావాల్సింది.ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేసినపుడే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. కానీ అఖిల్ కెరీర్కు చాలా కీలకమైన సినిమా కావడంతో మేకింగ్ విషయంలో రాజీ అన్నదే లేకుండా ముందుకు సాగుతోంది చిత్ర బృందం. అందు వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతోంది. ఆల్రెడీ ఇండిపెండెన్స్ డే వీకెండ్ నుంచి సినిమా తప్పుకుంది. ఇక తర్వాతి టార్గెట్ దసరా కావచ్చని అన్నారు. కానీ అప్పటికి కూడా సినిమా రిలీజయ్యే ఛాన్స్ తక్కువే అన్నది తాజా సమాచారం.
అసలీ ఏడాది ‘ఏజెంట్’ రిలీజ్ కాదట. దీన్ని 2022 సంక్రాంతి రేసులో నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. మామూలుగా సంక్రాంతి బెర్తులు ఐదారు నెలల ముందే ఖరారైపోతుంటాయి. ఐతే వచ్చే సంక్రాంతి సినిమాల విషయంలో క్లారిటీ లేదు. ఆ పండక్కి అనుకున్న సినిమా ఒక్కొక్కటిగా రేసు నుంచి తప్పుకుంటూ వస్తోంది.
రామ్ చరణ్-శంకర్ సినిమా, హరి హర వీరమల్లు, మహేష్-త్రివిక్రమ్ మూవీ.. ఇలా ఎప్పటికప్పుడు ఒక కొత్త సినిమాను సంక్రాంతి రేసులో నిలిపినట్లు కనిపించింది. కానీ వీటిలో ఏదీ ఆ పండక్కి వచ్చే అవకాశాలు లేవు. హరి హర వీరమల్లు అసలెప్పటికి పూర్తవుతుందో తెలియట్లేదు. మహేష్-త్రివిక్రమ్ సినిమా మొదలవడంలో ఆలస్యం జరగడంతో వచ్చే వేసవికి వాయిదా పడిపోయింది. చరణ్-శంకర్ సినిమా కూడా సంక్రాంతి రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతానికి 2022 సంక్రాంతి ఖరారైన సినిమాలు ఆదిపురుష్, గాడ్ ఫాదర్ మాత్రమే. వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు కానీ.. అది వచ్చే అవకాశాలు తక్కువేనట.
ఈ నేపథ్యంలో మంచి క్రేజున్న ‘ఏజెంట్’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసి ప్రయోజనం పొందాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. మామూలు రోజులతో పోలిస్తే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు సంక్రాంతి టైంలో 30-40 శాతం ఎక్కువ వసూళ్లు వస్తాయి. అందుకే ‘ఏజెంట్’ను ఆ టైంలో రిలీజ్ చేసి అఖిల్కు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి అతడిని మాస్ హీరోగా నిలబెట్టాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on July 28, 2022 2:26 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…