రామారావు: ఆన్ డ్యూటీ.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త సినిమా మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే కనిపిస్తోంది. ఈ చిత్రాన్నిరూపొందించిన శరత్ మండవను అందరూ కొత్త దర్శకుడు అని అంటున్నారు. సోషల్ మీడియా, వెబ్ మీడియాలో కూడా చాలామంది అలాగే రాసేస్తున్నారు. కానీ శరత్ టాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న మాట వాస్తవమే కానీ.. అతడికి దర్శకుడిగా ఇది తొలి సినిమా మాత్రం కాదు.
శరత్ చాలా ఏళ్లు తమిళ ఫిలిం ఇండస్ట్రీలోనే పని చేశాడు. అక్కడే ఓ సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా పేరు.. కో-2. కమల్ హాసన్ సంస్థ ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్’లో కొన్నేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా పని చేశాడు శరత్. కమల్ సినిమా ‘ఈనాడు’కు అతను దర్శకత్వ విభాగంలో బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు పని చేసి.. 2016లోనే ‘కో-2’తో శరత్ దర్శకుడిగా మారాడు.
‘కో-2’ సినిమాతో తెలుగులో బ్లాక్బస్టర్ అయిన అనువాద చిత్రం ‘రంగం’కు సీక్వెల్ కావడం విశేషం. తమిళంలో ఆ సినిమా పేరు.. కో. జీవా హీరోగా వీఐ ఆనంద్ రూపొందించిన ఈ చిత్రానికి శరత్ సీక్వెల్ తీశాడు. కానీ సీక్వెల్ అని ప్రచారం జరిగింది కానీ.. కథంతా భిన్నంగా ఉంటుంది. బాబీ సింహా హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషించాడు. నిక్కీ గర్లాని కథానాయిక. సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చాయి. ఓ మాదిరిగా ఆడింది. శరత్ ఆశించిన సక్సెస్ అయితే కాదు. దీంతో దర్శకుడిగా తమిళంలో మరో అవకాశం రాలేదు. చాలా ఏళ్లు వెయిట్ చేసి, రవితేజను ఒప్పించిన ‘రామారావు: ఆన్ డ్యూటీ’తో తెలుగులోకి అడుగు పెడుతున్నాడు శరత్.
ఈ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి, శరత్ ఒకప్పుడు రూం మేట్స్ అట. శరత్ యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం వదులుకుని, ఇండియాకు వచ్చేసి సినిమా ప్రయత్నాలు చేసిన సమయంలో సుధాకర్తో కలిసి ఒకే అపార్ట్మెంట్లో ఉన్నాడట. ఆ పరిచయంతోనే ఇప్పుడు తన అరంగేట్ర చిత్రాన్ని సుధాకరే నిర్మించారట. మరి ఈ ఇద్దరు మిత్రులకు ‘రామారావు’ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…