రామారావు-ఆన్ డ్యూటీ చిత్రంతో టాలీవుడ్లో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు శరత్ మండవ. తన సినిమా విడుదల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో వెబ్ మీడియా హడావుడి రివ్యూల గురించి అతను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. యుఎస్లో ప్రిమియర్ షోలు పడడం ఆలస్యం రివ్యూలు ఇవ్వడాన్ని అతను తప్పుబట్టాడు. ఇప్పుడు రామారావు-ఆన్ డ్యూటీ ప్రి రిలీజ్ ఈవెంట్లో శరత్ వ్యాఖ్యలు మళ్లీ హాట్ టాపిక్గా మారాయి.
అతను కొత్త సినిమాలు రిలీజైనపుడు ట్విట్టర్లో వచ్చే షార్ట్ రివ్యూలు, ఫీడ్ బ్యాక్ విషయంలో ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. ట్విట్టర్లో ట్వీట్లు చూసి సినిమాలకు వెళ్లొద్దని అతను ప్రేక్షకులను కోరాడు. పిట్టలు రెట్టలు మాత్రమే వేస్తాయని.. అందులో మంచి ఏమీ ఉండదని.. సినిమాల గురించి ఇక్కడ చాలా మంది కావాలనే నెగెటివ్ ట్వీట్లు వేస్తుంటారని.. కాబట్టి వాటిని నమ్మి సినిమాల విషయంలో ఒక నిర్ణయానికి రావద్దని శరత్ పేర్కొన్నాడు. నేరుగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని.. అలా కాకుంటే రిలీజ్ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఆగాలని.. సినిమా అసలు ఫలితం ఏంటో అప్పుడు తెలుస్తుందని.. సినిమా బాగా లేదంటే చూడాల్సిన అవసరం లేదని శరత్ అన్నాడు.
ఇక తన సినిమా టికెట్ ధరల గురించి మట్లాడుతూ.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో రూ.195గా రేట్లు ఫిక్స్ చేశారని.. ఆంధ్రప్రదేశ్లో ధరలు ప్రభుత్వం చేతుల్లో ఉంటాయని.. అక్కడ సింగిల్ స్క్రీన్లలో 147, మల్టీప్లెక్సుల్లో రూ.177తో టికెట్లు అమ్ముతారని శరత్ ప్రకటించాడు. ఆన్ లైన్లో టికెట్లు కొంటే అదనంగా రూ.30 చెల్లించాల్సి ఉంటుందని.. అలా మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వడం ఎందుకని.. కొంచెం కష్టపడి థియేటర్లకు వెళ్లి అక్కడే టికెట్లు తీసుకుని ఎగ్జిబిటర్లకు ప్రయోజనం చేకూర్చాలని శరత్ పిలుపునివ్వడం విశేషం. రామారావు-ఆన్ డ్యూటీ ట్రైలర్లో మంచి సౌండ్ ఉందనుకుంటే.. సినిమా ఇంకా లౌడ్గా ఉంటుందని శరత్ అన్నాడు.
This post was last modified on July 25, 2022 12:00 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…