బీవీఎస్ రవి.. ఈ పేరుతో కంటే ‘మచ్చ రవి’ అనే పేరుతోనే బాగా ఫేమస్ అయిన రైటర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. రచయితగా 40కి పైగా సినిమాలకు పని చేశాడతను. అందులో ఖడ్గం, భద్ర, చక్రం అతిథి, మున్నా, పరుగు, కింగ్, తులసి, దేవుడు చేసిన మనుషులు, కెమెరామన్ గంగతో రాంబాబు.. ఇలా పేరున్న సినిమాలు చాలానే ఉన్నాయి.
రచయితగా ఇలాంటి ఫిల్మోగ్రఫీ ఉన్న వ్యక్తి దర్శకుడిగా మారితే ఈజీగా క్లిక్ అయిపోతాడని అనుకుంటాం. కానీ మెగా ఫోన్ పట్టాక అతడి పరిస్థితి తలకిందులైంది. గోపీచంద్ లాంటి స్టార్తో అతడి అరంగేట్ర సినిమా కుదిరింది. కానీ వీరి కలయికలో వచ్చిన ‘వాంటెడ్’ పెద్ద డిజాస్టర్గా నిలిచింది. దీంతో దర్శకుడిగా చాలా గ్యాప్ తప్పలేదు. మళ్లీ కష్టపడి సాయిధరమ్ తేజ్తో ‘జవాన్’ అనే సినిమా తీస్తే తొలి చిత్రంతో పోలిస్తే బెటర్ టాక్ వచ్చిందే తప్ప ప్రేక్షకాదరణ పొందలేదు.
దెబ్బకు దర్శకుడిగా సినిమాలు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.రచయితగా కూడా బీవీఎస్ రవికి చాన్నాళ్లుగా సినిమాలు లేవు. మధ్యలో బాలయ్యతో ‘అన్స్టాపబుల్’ షోను చాలా బాగా డీల్ చేయడంతో అతడి గురించి కొంచెం చర్చ జరిగింది. అదే టైంలో ‘థాంక్యూ’ సినిమాకు కథ అందించాడు రవి. విక్రమ్ కుమార్ లాంటి విలక్షణ దర్శకుడు.. రవి కథతో సినిమా చేస్తున్నాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత, కొత్తదనం ఉంటుందనే అంతా అనుకున్నారు. కానీ తీరా సినిమా చూశాక అసలు ఈ కథలో ఏముందని విక్రమ్, దిల్ రాజు, చైతూ ఎగ్జైట్ అయ్యారో అర్థం కావట్లేదు ఎవ్వరికీ.
కొన్ని పాత సినిమాలను కలిపి తయారు చేసిన కథలా ఉంది తప్ప.. ఇందులో ఏ కొత్తదనం కనిపించలేదు. ఈ సినిమా వల్ల విక్రమ్ బ్రాండ్ వాల్యూ బాగా దెబ్బ తినేలా ఉంది. ఇంతకుముందు ఫ్లాప్ సినిమాల్లో కూడా తన మార్కు చూపించగలిగిన విక్రమ్.. ఈ సినిమాలో మాత్రం నిస్సహాయుడిగా కనిపించాడు. అందుకు విషయం లేని కథే కారణం అన్నది స్పష్టం. అందుకే బీవీఎస్ రవి ఇప్పుడు సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోయాడు. అతడి మీద ట్రోలింగ్ గట్టిగానే జరుగుతోంది. ఈ సినిమాతో వచ్చిన చెడ్డ పేరుతో రవి కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది.
This post was last modified on July 24, 2022 12:22 am
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…