బీవీఎస్ రవి.. ఈ పేరుతో కంటే ‘మచ్చ రవి’ అనే పేరుతోనే బాగా ఫేమస్ అయిన రైటర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. రచయితగా 40కి పైగా సినిమాలకు పని చేశాడతను. అందులో ఖడ్గం, భద్ర, చక్రం అతిథి, మున్నా, పరుగు, కింగ్, తులసి, దేవుడు చేసిన మనుషులు, కెమెరామన్ గంగతో రాంబాబు.. ఇలా పేరున్న సినిమాలు చాలానే ఉన్నాయి.
రచయితగా ఇలాంటి ఫిల్మోగ్రఫీ ఉన్న వ్యక్తి దర్శకుడిగా మారితే ఈజీగా క్లిక్ అయిపోతాడని అనుకుంటాం. కానీ మెగా ఫోన్ పట్టాక అతడి పరిస్థితి తలకిందులైంది. గోపీచంద్ లాంటి స్టార్తో అతడి అరంగేట్ర సినిమా కుదిరింది. కానీ వీరి కలయికలో వచ్చిన ‘వాంటెడ్’ పెద్ద డిజాస్టర్గా నిలిచింది. దీంతో దర్శకుడిగా చాలా గ్యాప్ తప్పలేదు. మళ్లీ కష్టపడి సాయిధరమ్ తేజ్తో ‘జవాన్’ అనే సినిమా తీస్తే తొలి చిత్రంతో పోలిస్తే బెటర్ టాక్ వచ్చిందే తప్ప ప్రేక్షకాదరణ పొందలేదు.
దెబ్బకు దర్శకుడిగా సినిమాలు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది.రచయితగా కూడా బీవీఎస్ రవికి చాన్నాళ్లుగా సినిమాలు లేవు. మధ్యలో బాలయ్యతో ‘అన్స్టాపబుల్’ షోను చాలా బాగా డీల్ చేయడంతో అతడి గురించి కొంచెం చర్చ జరిగింది. అదే టైంలో ‘థాంక్యూ’ సినిమాకు కథ అందించాడు రవి. విక్రమ్ కుమార్ లాంటి విలక్షణ దర్శకుడు.. రవి కథతో సినిమా చేస్తున్నాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత, కొత్తదనం ఉంటుందనే అంతా అనుకున్నారు. కానీ తీరా సినిమా చూశాక అసలు ఈ కథలో ఏముందని విక్రమ్, దిల్ రాజు, చైతూ ఎగ్జైట్ అయ్యారో అర్థం కావట్లేదు ఎవ్వరికీ.
కొన్ని పాత సినిమాలను కలిపి తయారు చేసిన కథలా ఉంది తప్ప.. ఇందులో ఏ కొత్తదనం కనిపించలేదు. ఈ సినిమా వల్ల విక్రమ్ బ్రాండ్ వాల్యూ బాగా దెబ్బ తినేలా ఉంది. ఇంతకుముందు ఫ్లాప్ సినిమాల్లో కూడా తన మార్కు చూపించగలిగిన విక్రమ్.. ఈ సినిమాలో మాత్రం నిస్సహాయుడిగా కనిపించాడు. అందుకు విషయం లేని కథే కారణం అన్నది స్పష్టం. అందుకే బీవీఎస్ రవి ఇప్పుడు సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోయాడు. అతడి మీద ట్రోలింగ్ గట్టిగానే జరుగుతోంది. ఈ సినిమాతో వచ్చిన చెడ్డ పేరుతో రవి కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది.
This post was last modified on July 24, 2022 12:22 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…