ఈ రోజుల్లో చిన్న సినిమాలు తీసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అన్నది కఠిన సవాలుగా మారిపోయింది. మిడ్ రేంజ్ సినిమాలనే జనాలు పెద్దగా పట్టించుకోని పరిస్థితుల్లో చిన్న సినిమాల పట్ల జనాలను ఆకర్షించడం ఎంత కష్టమో చెప్పేదేముంది? కొత్త హీరో, కొత్త దర్శకుడు అంటే ఆ సినిమా గురించి జనాలు అసలు మాట్లాడుకోవడమే లేదు. అలాంటపుడు ప్రమోషన్ల పరంగా ఏదో భిన్నంగా, క్రేజీగా చేస్తే తప్ప జనాల్లో ఆ సినిమా గురించి చర్చ ఉండదు. ఆ మాత్రం చర్చ లేకుంటే సినిమాకు ఓటీటీ డీల్ దక్కడం కూడా కష్టమే. అందుకే ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే చిత్ర బృందం ప్రమోషన్లను భలే వెరైటీగా ప్లాన్ చేసింది.
ఇది ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ శిష్యుడైన జగదీష్ డైరెక్టర్గా అరంగేట్రం చేస్తున్న సినిమా. అనుదీప్ సమర్పణలో తెరకెక్కింది. శిష్యుడి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి అనుదీప్ తనదైన శైలిలో ప్రమోషన్లు ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది. అతను ‘జాతిరత్నాలు’ టైంలో పాల్గొన్న టీవీ కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు టాక్ ఆఫ్ ద టాలీవుడ్గా మారిన సంగతి తెలిసిందే.
అనుదీప్ ఏ ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్నా అది చాలా వెరైటీగా, తిక్క తిక్కగా ఉంటుంది. ఇంతకుముందు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ఫస్ట్ లుక్ లాంచ్కు సంబంధించిన వీడియో కూడా ఇలాగే ఉండి జనాలను అలరించగా.. ఇప్పుడు సాంగ్ లాంచ్ పేరుతో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ను కలిసి ఈ చిత్ర బృందం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అనుదీప్, జగదీష్లతో పాటు ఈ చిత్ర హీరో, నిర్మాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లి అల్లు అరవింద్ను తమాషాగానే ఒక ఆట ఆడేసుకున్నారు. మీతో ‘టై అప్ అవుతాం’ అంటూ టీంలో ఒక్కొక్కరు అరవింద్తో చేసిన కామెడీ ఈ వీడియోలో హైలైట్.
ఇక చివరికొచ్చేసరికి అసలు పాట అంటూ లేకుండానే.. పాటను లాంచ్ చేసినట్లు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని అరవింద్కు చెప్పి ఆయనతో ఆ పని చేయించిన తీరు కొసమెరుపు. ఈ ప్రమోషనల్ వీడియో ఆద్యంతం అనుదీప్ మార్కుతో ఉండి.. జనాలను భలేగా ఎంటర్టైన్ చేస్తోంది. సినిమాకు ఈ ప్రమోషనల్ వీడియో ఎంత మేర ఉపయోగపడుతుందో కానీ.. ఈ వీడియో అయితే సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకునేలా ఉంది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…