బాలీవుడ్లో చాలా మంది కపుల్స్ను చూశాం. కానీ వాళ్లందరిలో అర్జున్ కపూర్-మలైకా అరోరాలది భిన్నమైన జంట. వేరే జంటల్లోనూ వయసు అంతరాలున్నాయి కానీ.. మరీ అర్జున్ కంటే మలైకాకు 11 ఏళ్లు పెద్దది కావడం.. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలుండడం చూసి అంతా ఈ జంట విషయంలో ఆశ్చర్యానికి గురయ్యారు. ముందు వీళ్లిద్దరి ప్రేమాయణం గురించి మీడియాలో వార్తలొస్తే చాలామందికి నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ మలైకా.. అర్బాజ్ నుంచి విడాకులు తీసుకుని అర్జున్తో బహిరంగంగా కలిసి తిరగడంతో నమ్మక తప్పలేదు.
ఎవరేమనుకున్నా తమకు అనవసరం అంటూ ఈ జంట కొన్నేళ్ల నుంచి తమకు నచ్చినట్లు బతుకుతోంది. మలైకా కోసమని ఏకంగా రూ.20 కోట్లు పెట్టి తన పాత ఇంటికి దగ్గర్లోనే అర్జున్ బాంద్రా (ముంబయి)లో ఒక లగ్జరీ ఫ్లాట్ కూడా కొన్నాడు కొన్నేళ్ల ముందు. ఆ ఫ్లాట్లోనే ఈ జంట సహజీవనం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ఐతే ఇప్పుడు అర్జున్ ఉన్నట్లుండి ఆ ఫ్లాట్ను అమ్మేయడం చర్చనీయాంశంగా మారింది. పైగా నష్టానికి ఆ ఫ్లాట్ను అమ్మేసినట్లు వార్తలొస్తుండడం గమనార్హం. 20 కోట్లకు కొని, 16 కోట్లకే ఫ్లాట్ను అమ్మాడట అర్జున్. ఇలా ఫ్లాట్ కొన్న కొన్నేళ్ల తర్వాత 20 శాతం నష్టానికి అమ్ముకోవడం విచిత్రంగా అనిపిస్తోంది. ఫ్లాట్ రేటు ఎందుకు పడిపోయిందన్నది పక్కన పెడితే.. ఇలా నష్టానికి అత్యవసరంగా అర్జున్ ఎందుకు దాన్ని అమ్మేశాడు అన్నది చర్చనీయాంశంగా మారింది. అతడికి ఆర్థికంగా అంత పెద్ద అవసరాలేమీ లేకపోవచ్చు.
మలైకాతో అతడికి చెడిందని.. అందుకే తనకు దగ్గరగా ఉండొద్దన్న ఉద్దేశంతోనే అతను ఫ్లాట్ అమ్మేశాడని బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. అర్జున్తో మలైకాల బంధమే అసహజం అని.. ఎప్పటికైనా ఇలా అవ్వాల్సిందే అంటూ నెటిజన్లు ఆల్రెడీ సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలుపెట్టేశారు. మరి నిజంగానే ఈ జంట విడిపోనుందా.. లేక ఫ్లాట్ అమ్మకానికి వేరే కారణాలున్నాయా అన్నది తెలియాల్సి ఉంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…