బాలీవుడ్లో చాలా మంది కపుల్స్ను చూశాం. కానీ వాళ్లందరిలో అర్జున్ కపూర్-మలైకా అరోరాలది భిన్నమైన జంట. వేరే జంటల్లోనూ వయసు అంతరాలున్నాయి కానీ.. మరీ అర్జున్ కంటే మలైకాకు 11 ఏళ్లు పెద్దది కావడం.. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలుండడం చూసి అంతా ఈ జంట విషయంలో ఆశ్చర్యానికి గురయ్యారు. ముందు వీళ్లిద్దరి ప్రేమాయణం గురించి మీడియాలో వార్తలొస్తే చాలామందికి నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ మలైకా.. అర్బాజ్ నుంచి విడాకులు తీసుకుని అర్జున్తో బహిరంగంగా కలిసి తిరగడంతో నమ్మక తప్పలేదు.
ఎవరేమనుకున్నా తమకు అనవసరం అంటూ ఈ జంట కొన్నేళ్ల నుంచి తమకు నచ్చినట్లు బతుకుతోంది. మలైకా కోసమని ఏకంగా రూ.20 కోట్లు పెట్టి తన పాత ఇంటికి దగ్గర్లోనే అర్జున్ బాంద్రా (ముంబయి)లో ఒక లగ్జరీ ఫ్లాట్ కూడా కొన్నాడు కొన్నేళ్ల ముందు. ఆ ఫ్లాట్లోనే ఈ జంట సహజీవనం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ఐతే ఇప్పుడు అర్జున్ ఉన్నట్లుండి ఆ ఫ్లాట్ను అమ్మేయడం చర్చనీయాంశంగా మారింది. పైగా నష్టానికి ఆ ఫ్లాట్ను అమ్మేసినట్లు వార్తలొస్తుండడం గమనార్హం. 20 కోట్లకు కొని, 16 కోట్లకే ఫ్లాట్ను అమ్మాడట అర్జున్. ఇలా ఫ్లాట్ కొన్న కొన్నేళ్ల తర్వాత 20 శాతం నష్టానికి అమ్ముకోవడం విచిత్రంగా అనిపిస్తోంది. ఫ్లాట్ రేటు ఎందుకు పడిపోయిందన్నది పక్కన పెడితే.. ఇలా నష్టానికి అత్యవసరంగా అర్జున్ ఎందుకు దాన్ని అమ్మేశాడు అన్నది చర్చనీయాంశంగా మారింది. అతడికి ఆర్థికంగా అంత పెద్ద అవసరాలేమీ లేకపోవచ్చు.
మలైకాతో అతడికి చెడిందని.. అందుకే తనకు దగ్గరగా ఉండొద్దన్న ఉద్దేశంతోనే అతను ఫ్లాట్ అమ్మేశాడని బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. అర్జున్తో మలైకాల బంధమే అసహజం అని.. ఎప్పటికైనా ఇలా అవ్వాల్సిందే అంటూ నెటిజన్లు ఆల్రెడీ సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలుపెట్టేశారు. మరి నిజంగానే ఈ జంట విడిపోనుందా.. లేక ఫ్లాట్ అమ్మకానికి వేరే కారణాలున్నాయా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on July 22, 2022 7:39 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…