బాలీవుడ్లో చాలా మంది కపుల్స్ను చూశాం. కానీ వాళ్లందరిలో అర్జున్ కపూర్-మలైకా అరోరాలది భిన్నమైన జంట. వేరే జంటల్లోనూ వయసు అంతరాలున్నాయి కానీ.. మరీ అర్జున్ కంటే మలైకాకు 11 ఏళ్లు పెద్దది కావడం.. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలుండడం చూసి అంతా ఈ జంట విషయంలో ఆశ్చర్యానికి గురయ్యారు. ముందు వీళ్లిద్దరి ప్రేమాయణం గురించి మీడియాలో వార్తలొస్తే చాలామందికి నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ మలైకా.. అర్బాజ్ నుంచి విడాకులు తీసుకుని అర్జున్తో బహిరంగంగా కలిసి తిరగడంతో నమ్మక తప్పలేదు.
ఎవరేమనుకున్నా తమకు అనవసరం అంటూ ఈ జంట కొన్నేళ్ల నుంచి తమకు నచ్చినట్లు బతుకుతోంది. మలైకా కోసమని ఏకంగా రూ.20 కోట్లు పెట్టి తన పాత ఇంటికి దగ్గర్లోనే అర్జున్ బాంద్రా (ముంబయి)లో ఒక లగ్జరీ ఫ్లాట్ కూడా కొన్నాడు కొన్నేళ్ల ముందు. ఆ ఫ్లాట్లోనే ఈ జంట సహజీవనం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ఐతే ఇప్పుడు అర్జున్ ఉన్నట్లుండి ఆ ఫ్లాట్ను అమ్మేయడం చర్చనీయాంశంగా మారింది. పైగా నష్టానికి ఆ ఫ్లాట్ను అమ్మేసినట్లు వార్తలొస్తుండడం గమనార్హం. 20 కోట్లకు కొని, 16 కోట్లకే ఫ్లాట్ను అమ్మాడట అర్జున్. ఇలా ఫ్లాట్ కొన్న కొన్నేళ్ల తర్వాత 20 శాతం నష్టానికి అమ్ముకోవడం విచిత్రంగా అనిపిస్తోంది. ఫ్లాట్ రేటు ఎందుకు పడిపోయిందన్నది పక్కన పెడితే.. ఇలా నష్టానికి అత్యవసరంగా అర్జున్ ఎందుకు దాన్ని అమ్మేశాడు అన్నది చర్చనీయాంశంగా మారింది. అతడికి ఆర్థికంగా అంత పెద్ద అవసరాలేమీ లేకపోవచ్చు.
మలైకాతో అతడికి చెడిందని.. అందుకే తనకు దగ్గరగా ఉండొద్దన్న ఉద్దేశంతోనే అతను ఫ్లాట్ అమ్మేశాడని బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. అర్జున్తో మలైకాల బంధమే అసహజం అని.. ఎప్పటికైనా ఇలా అవ్వాల్సిందే అంటూ నెటిజన్లు ఆల్రెడీ సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలుపెట్టేశారు. మరి నిజంగానే ఈ జంట విడిపోనుందా.. లేక ఫ్లాట్ అమ్మకానికి వేరే కారణాలున్నాయా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on July 22, 2022 7:39 pm
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…