రెండు వారాల నుంచి పబ్లిసిటీతో హోరెత్తిస్తున్న లైగర్ ట్రైలర్ ని ఇవాళ హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో భారీ జన సందోహం మధ్య విడుదల చేశారు. నిన్నే ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ అండర్ వేర్ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ కావడం దాని మీద రకరకాల ట్రోల్స్ మీమ్స్ రావడం కోరుకున్న ప్రచారం కంటే ఎక్కువే తెచ్చి పెట్టింది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్, డియర్ కామ్రేడ్-వరల్డ్ ఫేమస్ లవర్ వైఫల్యాల తర్వాత రౌడీ హీరో చేసిన మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు.
ఇక ట్రైలర్ సంగతి చూస్తే ఎప్పటిలాగే పూరి తన మార్కుని కొనసాగించారు. కథ మరీ ఊహించనిది అనిపించలేదు కానీ క్యారెక్టర్ల పరంగా ఇచ్చిన ట్విస్టులు మాత్రం కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా తల్లి పాత్ర పోషించిన రమ్యకృష్ణని ఊరమాస్ గా చూపించేశారు. పులికి సింహానికి క్రాస్ బ్రీడ్ నా కొడుకు అంటూ ఆవిడ డైలాగ్ తోనే వీడియో మొదలయ్యింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ రిచ్ గా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండకు నత్తి పెట్టేశారు. ఇటీవలే ఎఫ్3లో వరుణ్ తేజ్ దీన్ని కామెడీ స్లాంగ్ తో చేయగా లైగర్ లో మాత్రం సీరియస్ టచ్ ఉంది.
మొత్తానికి ఫ్యాన్స్ కోరుకున్నట్టే యాక్షన్ మసాలాతో లైగర్ ని నింపేశారు. హీరోయిన్ అనన్య పాండేని కొన్ని సీన్లలో అలా చూపించి వదిలేశారు. మైక్ టైసన్ విజువల్స్ కూడా రివీల్ చేశారు. మొన్నటి దాకా సంగీత దర్శకుడి పేరు విషయంలో సస్పెన్స్ కొనసాగింది కానీ టైటిల్ కార్డు చివరిలో బ్యాక్ గ్రౌండ్ కోర్ సునీల్ కశ్యప్ అని చెప్పేశారు. మ్యూజిక్ సూపర్ వైజర్ గా అజీమ్ దయాని పేరు ఉంది. అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయికి ఇంటర్నేషనల్ వెర్షన్ గా ఈ లైగర్ ని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఆగస్ట్ 25 అయిదు భాషల్లో విడుదల చేయనున్నారు
This post was last modified on July 21, 2022 10:32 am
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…