రెండు వారాల నుంచి పబ్లిసిటీతో హోరెత్తిస్తున్న లైగర్ ట్రైలర్ ని ఇవాళ హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో భారీ జన సందోహం మధ్య విడుదల చేశారు. నిన్నే ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ అండర్ వేర్ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ కావడం దాని మీద రకరకాల ట్రోల్స్ మీమ్స్ రావడం కోరుకున్న ప్రచారం కంటే ఎక్కువే తెచ్చి పెట్టింది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్, డియర్ కామ్రేడ్-వరల్డ్ ఫేమస్ లవర్ వైఫల్యాల తర్వాత రౌడీ హీరో చేసిన మూవీ కావడంతో అంచనాలు మాములుగా లేవు.
ఇక ట్రైలర్ సంగతి చూస్తే ఎప్పటిలాగే పూరి తన మార్కుని కొనసాగించారు. కథ మరీ ఊహించనిది అనిపించలేదు కానీ క్యారెక్టర్ల పరంగా ఇచ్చిన ట్విస్టులు మాత్రం కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా తల్లి పాత్ర పోషించిన రమ్యకృష్ణని ఊరమాస్ గా చూపించేశారు. పులికి సింహానికి క్రాస్ బ్రీడ్ నా కొడుకు అంటూ ఆవిడ డైలాగ్ తోనే వీడియో మొదలయ్యింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ రిచ్ గా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండకు నత్తి పెట్టేశారు. ఇటీవలే ఎఫ్3లో వరుణ్ తేజ్ దీన్ని కామెడీ స్లాంగ్ తో చేయగా లైగర్ లో మాత్రం సీరియస్ టచ్ ఉంది.
మొత్తానికి ఫ్యాన్స్ కోరుకున్నట్టే యాక్షన్ మసాలాతో లైగర్ ని నింపేశారు. హీరోయిన్ అనన్య పాండేని కొన్ని సీన్లలో అలా చూపించి వదిలేశారు. మైక్ టైసన్ విజువల్స్ కూడా రివీల్ చేశారు. మొన్నటి దాకా సంగీత దర్శకుడి పేరు విషయంలో సస్పెన్స్ కొనసాగింది కానీ టైటిల్ కార్డు చివరిలో బ్యాక్ గ్రౌండ్ కోర్ సునీల్ కశ్యప్ అని చెప్పేశారు. మ్యూజిక్ సూపర్ వైజర్ గా అజీమ్ దయాని పేరు ఉంది. అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయికి ఇంటర్నేషనల్ వెర్షన్ గా ఈ లైగర్ ని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఆగస్ట్ 25 అయిదు భాషల్లో విడుదల చేయనున్నారు
This post was last modified on July 21, 2022 10:32 am
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. తన తొలి భార్యతో వేరు పడి దివ్వెల మాధురితో…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన సుదీర్ఘ ప్రసంగం సింగిల్ సెకండ్ కూడా…
నిజమే… ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన అవడానికి కొత్త పార్టీనే అయినా… దేశంలోని అన్ని రాజకీయ…
నియోజకవర్గాల పునర్విభజన అంశం.. దేశవ్యాప్తంగా చర్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తమిళ నాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అప్పుడెప్పుడో తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తొలి సారి…
టాలీవుడ్ లో విలన్ల కొరత వాస్తవం. ఎంత బాలీవుడ్ నుంచి కొందరిని తీసుకొచ్చినా నేటివిటీ సమస్య వల్ల ఒరిజినాలిటి రావడం…