ఆ హీరోలకి సైడ్ ఇచ్చిన నిఖిల్

హీరో నిఖిల్ , చందూ మొండేటి కాంబినేషన్ లో వస్తున్న ‘కార్తికేయ 2’ కి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే రోజు నితిన్ మాస్ మూవీ ‘మాచర్ల నియోజిక వర్గం’ రిలీజ్ అవ్వనుంది. సమంత యశోద కూడా వచ్చే అవకాశం ఉంది. నిఖిల్ సోలో రిలీజ్ కోసం చాలా వెయిట్ చేశాడు. ఎట్టకేలకు జులై 22న ఫిక్స్ చేసుకొని ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. కానీ ఉన్నపళంగా ‘థాంక్యూ’ ని జులై 8 నుండి జులై 22 కి తనకి కన్వినెంట్ గా పోస్ట్ పోన్ చేసుకున్నారు దిల్ రాజు.

దీంతో నిఖిల్ పక్కకి తప్పుకోక తప్పలేదు. అలా చైతు కి సైడ్ ఇచ్చిన నిఖిల్ మళ్ళీ ఆగస్ట్ 5న ఒక డేట్ అనుకున్నాడు. కానీ ఆ డేట్ కి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ఫిక్సయింది. దాంతో ఇంకా ఎనౌన్స్ చేయకుండానే నిఖిల్ తన ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఒకసారి చైతు సినిమా కోసం మరోసారి కళ్యాణ్ రామ్ సినిమా కోసం కార్తికేయ 2 వాయిదా వేసుకున్నాడు నిఖిల్. ఫైనల్ గా ఇప్పుడు నితిన్ సినిమాతో పోటీ పడబోతున్నాడు.

కార్తికేయ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై కొంత బజ్ ఉంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఏ మాత్రం టాక్ బాగున్నా ఈ సీక్వెల్ తో నిఖిల్ హిట్ కొట్టడం ఖాయం. పైగా అనుపమ క్రేజ్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. చూడాలి మరి నితిన్ తో పోటీ పడి నిఖిల్ హిట్ కొడతాడా లేదా ?