‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా కొరటాల శివతోనే అన్న సంగతి తెలిసిందే. నిజానికి ముందు త్రివిక్రమ్తో సినిమా అనుకున్నప్పటికీ.. ఏవో కారణాల వల్ల అది క్యాన్సిలైంది. దాని స్థానంలో కొరటాల సినిమా వచ్చింది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేసి తారక్ ఎప్పుడో అందుబాటులో వచ్చినప్పటికీ.. ‘ఆచార్య’ బాగా ఆలస్యం కావడంతో కొరటాల ఫ్రీ అవ్వడానికి టైం పట్టింది. అయినా సరే తారక్ ఓపిగ్గా ఎదురు చూస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఏప్రిల్ నెలాఖర్లో ‘ఆచార్య’ రిలీజైపోవడంతో తారక్ సినిమాను కొరటాల మొదలు పెట్టడానికి లైన్ క్లియర్ అయినట్లే అనుకున్నారంతా.
జూన్లో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ తీరా చూస్తే జూన్ వచ్చింది. వెళ్లింది. ఇప్పుడు జులై కూడా పూర్తి కావస్తోంది. కానీ సినిమా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. కొరటాల ఫెయిల్యూర్లో ఉన్నాడని తారక్ వెనక్కి తగ్గే టైపు అయితే కాదు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత త్రివిక్రమ్తో ధైర్యగా సినిమా చేశాడు. ‘అరవింద సమేత’తో మంచి ఫలితాన్నందుకున్నాడు.
ఇలాగే కొరటాలతోనూ మ్యాజిక్ జరుగుతుందని అనుకుంటే.. ఈ సినిమా ఇప్పుడు వెనక్కి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. అలా అని కొరటాల మీద అనుమానంతో తారక్ ఏమీ ఆ సినిమా ఆపేయట్లేదట. ఈ సినిమా స్క్రిప్టు విషయంలో పూర్తి సంతృప్తి చెందకపోవడం, ‘ఆచార్య’ సెటిల్మెంట్ గొడవల వల్ల కొరటాల అనుకున్న సమయానికి బౌండ్ స్క్రిప్టు రెడీ చేయలేకపోవడంతో ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేద్దామన్న ఆలోచనలో తారక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తనకు చాలా గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఇంకా ఎక్కువ రోజులు ఆగే పరిస్థితి లేదని, బుచ్చిబాబు సానా తన కోసం పక్కాగా కథ రెడీ చేసి ఉండడంతో ఆ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదికి తీసుకెళ్లిపోదామని తారక్ చూస్తున్నట్లు సమాచారం.
ఈ విషయంలో కొరటాల హర్ట్ కాకుండా వ్యవహారాన్ని డీల్ చేయాలని చూస్తున్నాడని.. ఏ ప్రెజర్ లేకుండా ప్రశాంతంగా స్క్రిప్టు రెడీ చేసుకోమని, బుచ్చిబాబు సినిమా అవ్వగానే కొరటాల సినిమానే చేస్తానని మాట ఇచ్చి ముందుకెళ్లబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు హడావుడి పడుతూ తన గురువు సుకుమార్ను కలిసి ఎన్టీఆర్తో చేయాల్సిన సినిమా స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నాడని.. సుకుమార్ కూడా ‘పుష్ప-2’ పని పక్కన పెట్టి శిష్యుడికి సాయం చేస్తున్నాడని.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయని తెలిసింది.
This post was last modified on July 20, 2022 4:43 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…