ఛలోని ఏ ముహూర్తంలో ఒప్పుకుందో కానీ అప్పటి నుంచి రష్మిక మందన్న జాతకమే మారిపోయింది. అక్కడిదాకా ఓ మోస్తరు అవకాశాలతో శాండల్ వుడ్ లో నెట్టుకొస్తున్న తనకు ఏకంగా ఇక్కడ రెడ్ కార్పెట్ దక్కింది. ఆ తర్వాత గీత గోవిందంతో ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. దేవదాస్, డియర్ కామ్రేడ్ లు వరసగా ఫ్లాప్ అయినా వాటి ప్రభావం కెరీర్ మీద పడలేదు. సరిలేరు నీకెవ్వరు, భీష్మలు సూపర్ హిట్ కావడంతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇక పుష్పతో జరిగిన మేలు ఎంతో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు తన చేతిలో హిందీ తెలుగు తమిళంలో మంచి ఆఫర్లున్నాయి. బాలీవుడ్ లో చేస్తున్న మిషన్ మజ్ను, గుడ్ బైలు పూర్తయ్యే స్టేజి లో ఉండగా టైగర్ శ్రోఫ్ కు మరో కొత్త ప్రాజెక్టులో జోడిగా నటించడం దాదాపుగా లాక్ అయినట్టే. రన్బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో చేస్తున్న అనిమల్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకంతో ఉంది. ఇవి కాకుండా విజయ్ వారసుడులో ఛాన్స్ కొట్టేయడం తమిళనేల మీద జెండా పాతేందుకు అవకాశం ఇచ్చినట్టే. పుష్ప 2 ది రూల్ ఎలాగూ చేతిలో ఉంది.
ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ చియాన్ విక్రమ్ తో ఓ సినిమాకు రష్మిక సైన్ చేయబోతోందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆయన వయసు 56 ఏళ్ళు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ బ్యూటీస్ విక్రమ్ సరసన నటించడం లేదు. కోబ్రాలో చేసిన కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా అది ఎప్పుడో ఒప్పుకున్న ప్రాజెక్ట్. అందులో పాత్ర తీరుతెన్నులు ఇంకా తెలియదు. మరి ఇంత ఫామ్ లో ఉన్న రష్మిక విక్రమ్ జోడి అంటే మిస్ మ్యాచ్ అవుతుందేమోననే అనుమానం రాకపోదు. లేదూ తను చేస్తోంది వేరే క్యారెక్టరా అనేది తెలిశాక దీని గురించి క్లారిటీ రావొచ్చు. చూద్దాం
This post was last modified on July 19, 2022 10:16 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…