Movie News

టీమ్ కి సారీ చెప్పిన అనసూయ

పెద్ద సినిమాలను ప్రమోట్ చేయడానికి ఎవరూ అక్కర్లేదు. స్టార్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ తో ఆ సినిమాలు సోషల్ మీడియాలో గట్టిగానే ప్రమోట్ అవుతుంటాయి. కానీ చిన్న సినిమాలకు అలా కాదు. అందులో నటించిన వారిలో ఓ మోస్తరు పరిచయం ఉన్న ఆర్టిస్ట్ ముందుకొచ్చి ప్రమోషన్ చేస్తే సినిమా అంతో ఇంతో రీచ్ అవుతుంది. అనసూయ లాంటి యాక్ట్రెస్ ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తే సినిమా మీద బజ్ క్రియేట్ అవుతుంది. అయితే ఇలానే ప్లాన్ చేసుకొని ‘దర్జా’ రిలీజ్ గురించి దర్జాగా ఉన్నారు నిర్మాతలు. కానీ అనసూయ సినిమా రిలీజ్ ప్రమోషన్ లో కనిపించకుండా హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకూ టీం ఎన్ని ప్రమోషన్స్ చేసిన అవి ఎక్కడా కనబడని పరిస్థితి.

అనసూయ రిలీజ్ కి ముందు తమ సినిమాను ప్రమోట్ చేసే రోజు కోసం ఎదురుచూశారు మేకర్స్. సినిమాలో సునీల్ కూడా నటించాడు కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరు కాలేదు. ఇక అనసూయ మాత్రం మేకర్స్ సారీ చెప్పుకుంది. తను ఇప్పటి వరకూ ప్రమోషన్స్ లో ఎందుకు కనబడలేదనే విషయం టీంకి బాగా తెలుసని తెలిపింది.

పర్సనల్ విషయాల కారణంగా పెండింగ్ పడ్డ షూటింగ్స్ అన్నీ ఒకేసారి వచ్చాయని వాటితో నటిగా బిజీ అయ్యానని ముఖ్యంగా హైదరాబాద్ కి దూరంగా షూటింగ్ చేస్తున్నాని అందుకే దర్జా ప్రమోషన్స్ లో కనిపించలేదని తెలిపింది. సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. అక్కడ అనసూయ ఇలా తన వర్షన్ చెప్పుకొని టీమ్ ని కూల్ చేసింది. ఈ రీజన్ తో అనసూయ తప్పించుకుంది ఫైనల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై మమ అనిపించుకుంది. ఇక ఆ మధ్య అనసూయ నటించిన ‘కథనం’ ఆడలేదు. మరి ఈ సినిమాతో అయినా అనసూయ సోలో హిట్ కొడుతుందా ? చూడాలి.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

28 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

34 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

48 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago