Movie News

తాప్సీ సినిమాలో శభాష్ లేదు

స్పోర్ట్స్ డ్రామాలు వద్దు మొర్రో అని ఆడియన్స్ మొత్తుకుంటున్నా సరే బాలీవుడ్ మేకర్స్ మాత్రం వదిలే ప్రసక్తే లేదంటున్నారు. నిన్న తాప్సీ టైటిల్ రోల్ పోషించిన శబాష్ మితు థియేటర్లలో అడుగు పెట్టింది. ముందు నుంచి ఏమైంత బజ్ లేదు కానీ ఏదైనా ఇంటరెస్టింగ్ కంటెంట్ ఉండకపోదాని మూవీ లవర్స్ ఎదురు చూశారు. కానీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ సినిమా శభాష్ అందుకోవడంలో ఫెయిలయ్యింది. చాలా వీక్ ఓపెనింగ్స్ తో మొదలైనప్పటికీ మౌత్ టాక్ మీద నమ్మకంతో టీమ్ ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చింది.

సుదీర్ఘమైన కెరీర్ కలిగిన ఏకైక మహిళగా మిథాలీ రాజ్ ప్రస్థానం చాలా గొప్పదే. ఇటీవలే రిటైర్ మెంట్ ప్రకటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందనలు పంపడం చూశాం. ప్రపంచవ్యాప్తంగా తన క్రీడకు ఫ్యాన్స్ గొప్ప వీడ్కోలు పలికారు. అందుకే మిథాలీ జీవిత కథ ఆధారంగా సినిమాను ప్రకటించినప్పుడు దీని మీద అంతో ఇంతో బజ్ ఏర్పడిన మాట వాస్తవం. అయితే దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ సెకండ్ హాఫ్ డ్రామాని పండించడంలో తడబడటంతో విపరీతమైన ల్యాగ్ అసహనానికి గురి చేసింది.

ముఖ్యంగా క్రికెటర్ గా తాప్సీ ఆ పాత్ర కోసం బాగా కష్టపడినప్పటికీ తను అంతగా మ్యాచ్ కాలేకపోయింది. దానికి తోడు ఎంఎస్ ధోని, అజర్, సచిన్, జెర్సీ తదితర చిత్రాల్లో ఆడియన్స్ బోలెడంత క్రికెట్ ని తెరమీద చూసేశారు. అలాంటప్పుడు ఆ క్రీడను మరింత రక్తికట్టించేలా చూపించాలి. కానీ అదేమీ జరగలేదు. అన్ని స్పోర్ట్ మూవీస్ లో చూసినట్టే ఇందులోనూ అవే మలుపులు ఉండటం నిరాశపరుస్తుంది. ఓటిటిలో వచ్చి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదేమో కానీ థియేటర్ కావడంతో నిట్టూర్పు తప్పలేదు మరి.

This post was last modified on July 16, 2022 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

17 minutes ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

1 hour ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

2 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

2 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

3 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

5 hours ago