స్పోర్ట్స్ డ్రామాలు వద్దు మొర్రో అని ఆడియన్స్ మొత్తుకుంటున్నా సరే బాలీవుడ్ మేకర్స్ మాత్రం వదిలే ప్రసక్తే లేదంటున్నారు. నిన్న తాప్సీ టైటిల్ రోల్ పోషించిన శబాష్ మితు థియేటర్లలో అడుగు పెట్టింది. ముందు నుంచి ఏమైంత బజ్ లేదు కానీ ఏదైనా ఇంటరెస్టింగ్ కంటెంట్ ఉండకపోదాని మూవీ లవర్స్ ఎదురు చూశారు. కానీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ సినిమా శభాష్ అందుకోవడంలో ఫెయిలయ్యింది. చాలా వీక్ ఓపెనింగ్స్ తో మొదలైనప్పటికీ మౌత్ టాక్ మీద నమ్మకంతో టీమ్ ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చింది.
సుదీర్ఘమైన కెరీర్ కలిగిన ఏకైక మహిళగా మిథాలీ రాజ్ ప్రస్థానం చాలా గొప్పదే. ఇటీవలే రిటైర్ మెంట్ ప్రకటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందనలు పంపడం చూశాం. ప్రపంచవ్యాప్తంగా తన క్రీడకు ఫ్యాన్స్ గొప్ప వీడ్కోలు పలికారు. అందుకే మిథాలీ జీవిత కథ ఆధారంగా సినిమాను ప్రకటించినప్పుడు దీని మీద అంతో ఇంతో బజ్ ఏర్పడిన మాట వాస్తవం. అయితే దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ సెకండ్ హాఫ్ డ్రామాని పండించడంలో తడబడటంతో విపరీతమైన ల్యాగ్ అసహనానికి గురి చేసింది.
ముఖ్యంగా క్రికెటర్ గా తాప్సీ ఆ పాత్ర కోసం బాగా కష్టపడినప్పటికీ తను అంతగా మ్యాచ్ కాలేకపోయింది. దానికి తోడు ఎంఎస్ ధోని, అజర్, సచిన్, జెర్సీ తదితర చిత్రాల్లో ఆడియన్స్ బోలెడంత క్రికెట్ ని తెరమీద చూసేశారు. అలాంటప్పుడు ఆ క్రీడను మరింత రక్తికట్టించేలా చూపించాలి. కానీ అదేమీ జరగలేదు. అన్ని స్పోర్ట్ మూవీస్ లో చూసినట్టే ఇందులోనూ అవే మలుపులు ఉండటం నిరాశపరుస్తుంది. ఓటిటిలో వచ్చి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదేమో కానీ థియేటర్ కావడంతో నిట్టూర్పు తప్పలేదు మరి.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…