టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్కు తన శిష్యుల్ని వృద్ధిలోకి తేవాలని మహా తపన. తన దగ్గర అసిస్టెంట్లుగా పని చేసిన అందరినీ దర్శకులు అవ్వాలని ఆయన గట్టిగా కోరుకుంటారని సన్నిహితులు చెబుతారు. ఇప్పటికే సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడయ్యాడు. రెండు సినిమాలు తీశాడు. అందులో కుమారి 21 ఎఫ్ బ్లాక్బస్టర్ అయింది. దీని తర్వాత 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు.
అలాగే సుకుమార్ స్నేహితులు, అతడి సినిమాలకు పని చేసిన హరిప్రసాద్ జక్కా, వేమారెడ్డి సైతం దర్శకులుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ వరుసలో బుచ్చిబాబు సానా కూడా దర్శకుడిగా మారాడు. సుక్కు ప్రియ శిష్యుల్లో ఒకడైన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే లాక్ డౌన్ వల్ల ఉప్పెన ఆలస్యమైంది కానీ.. లేకుంటే ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే. ఈ విషయంలో బుచ్చిబాబు చాలా ఫీలవుతున్నప్పటికీ.. అతడికి ఉపశమనాన్నిచ్చే పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. అతడితో సినిమా చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓకే అన్నట్లు తెలిసింది.
ఒక పెద్ద స్థాయి కమర్షియల్ కథను తయారు చేసుకెళ్లి సుకుమార్ రెకమండేషన్తో చరణ్ను కలిసి అతడికి కథ చెప్పగా.. చరణ్కు బాగా నచ్చిందట. ఇప్పటికే ఉప్పెన సినిమా చూసి ఇంప్రెస్ అయిన చరణ్.. వీలు చూసుకుని ఈ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. సుకుమార్ కూడా తన శిష్యుడి గురించి భరోసా ఇవ్వడం, అవసరమైతే స్క్రిప్టు, మేకింగ్లో తన సహకారం ఉంటుందని హామీ ఇవ్వడంతో చరణ్ భవిష్యత్తులో బుచ్చిబాబుతో పని చేయడానికి ఓకే అన్నట్లు సమాచారం.
This post was last modified on July 1, 2020 9:08 am
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…