టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్కు తన శిష్యుల్ని వృద్ధిలోకి తేవాలని మహా తపన. తన దగ్గర అసిస్టెంట్లుగా పని చేసిన అందరినీ దర్శకులు అవ్వాలని ఆయన గట్టిగా కోరుకుంటారని సన్నిహితులు చెబుతారు. ఇప్పటికే సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడయ్యాడు. రెండు సినిమాలు తీశాడు. అందులో కుమారి 21 ఎఫ్ బ్లాక్బస్టర్ అయింది. దీని తర్వాత 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు.
అలాగే సుకుమార్ స్నేహితులు, అతడి సినిమాలకు పని చేసిన హరిప్రసాద్ జక్కా, వేమారెడ్డి సైతం దర్శకులుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ వరుసలో బుచ్చిబాబు సానా కూడా దర్శకుడిగా మారాడు. సుక్కు ప్రియ శిష్యుల్లో ఒకడైన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే లాక్ డౌన్ వల్ల ఉప్పెన ఆలస్యమైంది కానీ.. లేకుంటే ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే. ఈ విషయంలో బుచ్చిబాబు చాలా ఫీలవుతున్నప్పటికీ.. అతడికి ఉపశమనాన్నిచ్చే పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. అతడితో సినిమా చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓకే అన్నట్లు తెలిసింది.
ఒక పెద్ద స్థాయి కమర్షియల్ కథను తయారు చేసుకెళ్లి సుకుమార్ రెకమండేషన్తో చరణ్ను కలిసి అతడికి కథ చెప్పగా.. చరణ్కు బాగా నచ్చిందట. ఇప్పటికే ఉప్పెన సినిమా చూసి ఇంప్రెస్ అయిన చరణ్.. వీలు చూసుకుని ఈ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. సుకుమార్ కూడా తన శిష్యుడి గురించి భరోసా ఇవ్వడం, అవసరమైతే స్క్రిప్టు, మేకింగ్లో తన సహకారం ఉంటుందని హామీ ఇవ్వడంతో చరణ్ భవిష్యత్తులో బుచ్చిబాబుతో పని చేయడానికి ఓకే అన్నట్లు సమాచారం.
This post was last modified on July 1, 2020 9:08 am
సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…