టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్కు తన శిష్యుల్ని వృద్ధిలోకి తేవాలని మహా తపన. తన దగ్గర అసిస్టెంట్లుగా పని చేసిన అందరినీ దర్శకులు అవ్వాలని ఆయన గట్టిగా కోరుకుంటారని సన్నిహితులు చెబుతారు. ఇప్పటికే సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడయ్యాడు. రెండు సినిమాలు తీశాడు. అందులో కుమారి 21 ఎఫ్ బ్లాక్బస్టర్ అయింది. దీని తర్వాత 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు.
అలాగే సుకుమార్ స్నేహితులు, అతడి సినిమాలకు పని చేసిన హరిప్రసాద్ జక్కా, వేమారెడ్డి సైతం దర్శకులుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ వరుసలో బుచ్చిబాబు సానా కూడా దర్శకుడిగా మారాడు. సుక్కు ప్రియ శిష్యుల్లో ఒకడైన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే లాక్ డౌన్ వల్ల ఉప్పెన ఆలస్యమైంది కానీ.. లేకుంటే ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే. ఈ విషయంలో బుచ్చిబాబు చాలా ఫీలవుతున్నప్పటికీ.. అతడికి ఉపశమనాన్నిచ్చే పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. అతడితో సినిమా చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓకే అన్నట్లు తెలిసింది.
ఒక పెద్ద స్థాయి కమర్షియల్ కథను తయారు చేసుకెళ్లి సుకుమార్ రెకమండేషన్తో చరణ్ను కలిసి అతడికి కథ చెప్పగా.. చరణ్కు బాగా నచ్చిందట. ఇప్పటికే ఉప్పెన సినిమా చూసి ఇంప్రెస్ అయిన చరణ్.. వీలు చూసుకుని ఈ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. సుకుమార్ కూడా తన శిష్యుడి గురించి భరోసా ఇవ్వడం, అవసరమైతే స్క్రిప్టు, మేకింగ్లో తన సహకారం ఉంటుందని హామీ ఇవ్వడంతో చరణ్ భవిష్యత్తులో బుచ్చిబాబుతో పని చేయడానికి ఓకే అన్నట్లు సమాచారం.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…