టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్కు తన శిష్యుల్ని వృద్ధిలోకి తేవాలని మహా తపన. తన దగ్గర అసిస్టెంట్లుగా పని చేసిన అందరినీ దర్శకులు అవ్వాలని ఆయన గట్టిగా కోరుకుంటారని సన్నిహితులు చెబుతారు. ఇప్పటికే సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడయ్యాడు. రెండు సినిమాలు తీశాడు. అందులో కుమారి 21 ఎఫ్ బ్లాక్బస్టర్ అయింది. దీని తర్వాత 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు.
అలాగే సుకుమార్ స్నేహితులు, అతడి సినిమాలకు పని చేసిన హరిప్రసాద్ జక్కా, వేమారెడ్డి సైతం దర్శకులుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ వరుసలో బుచ్చిబాబు సానా కూడా దర్శకుడిగా మారాడు. సుక్కు ప్రియ శిష్యుల్లో ఒకడైన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే లాక్ డౌన్ వల్ల ఉప్పెన ఆలస్యమైంది కానీ.. లేకుంటే ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే. ఈ విషయంలో బుచ్చిబాబు చాలా ఫీలవుతున్నప్పటికీ.. అతడికి ఉపశమనాన్నిచ్చే పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. అతడితో సినిమా చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓకే అన్నట్లు తెలిసింది.
ఒక పెద్ద స్థాయి కమర్షియల్ కథను తయారు చేసుకెళ్లి సుకుమార్ రెకమండేషన్తో చరణ్ను కలిసి అతడికి కథ చెప్పగా.. చరణ్కు బాగా నచ్చిందట. ఇప్పటికే ఉప్పెన సినిమా చూసి ఇంప్రెస్ అయిన చరణ్.. వీలు చూసుకుని ఈ సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. సుకుమార్ కూడా తన శిష్యుడి గురించి భరోసా ఇవ్వడం, అవసరమైతే స్క్రిప్టు, మేకింగ్లో తన సహకారం ఉంటుందని హామీ ఇవ్వడంతో చరణ్ భవిష్యత్తులో బుచ్చిబాబుతో పని చేయడానికి ఓకే అన్నట్లు సమాచారం.
This post was last modified on July 1, 2020 9:08 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…