ఇప్పుడంటే వార మాస పత్రికలు చదివేవాళ్ళు తగ్గిపోయారు కానీ నెట్ లేని కాలంలో మ్యాగజైన్లదే రాజ్యం. స్వాతి, ఆంధ్రప్రభ, సుప్రభాతం, నవ్య ఇలా రకరకాల పేర్లతో చదివే వినోదాన్ని అందించే సంస్థలు లెక్కలేనన్ని ఉండేవి. ఇవన్నీ ఎన్ని ఉన్నా ఇండియా టుడేది ప్రత్యేక స్థానం.రాజకీయ సామాజిక వర్తమాన విషయాల మీద చాలా లోతైన పరిశోధన చేసి కథనాలు ఇచ్చేది. అందుకే ధర ఎక్కువైనా సరే తెలుగు నాట కూడా దీని డిమాండ్ చాలా ఎక్కువ. స్థోమత లేని వాళ్ళు లైబ్రరీ నుంచి అద్దెకు తెచ్చి చదివేవాళ్ళు.
ఈ ఇండియా టుడేలో సాధారణంగా కవర్ పేజీలు జాతీయ అంతర్జాతీయ అంశాల మీద మాత్రమే ఉండేవి. చాలా అరుదుగా సినిమా తారలు, వాళ్ళ కెరీర్ మీద స్పెషల్ ఇష్యూస్ వేసేవాళ్ళు. దానికి మాములు డిమాండ్ ఉండేది కాదు. క్షణాల్లో కాపీలు అమ్ముడుపోయేవి. అలా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నాగార్జున తదితరులు ఆ గౌరవం దక్కించుకున్నారు. కట్ చేస్తే ఇండియా టుడే తెలుగు వెర్షన్ తర్వాత క్రమంలో ఆగిపోయింది. రీడర్స్ లేక ప్రస్తుతం హిందీ ఇంగ్లీష్ ఇష్యూస్ ని మాత్రమే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక తెలుగు హీరో బొమ్మ ఆ పుస్తకం ముఖచిత్రంగా వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోటోని ప్రింట్ చేసి ఇటీవలి కాలంలో సౌత్ సినిమా డామినేషన్ నార్త్ లో ఎంతగా పెరిగిపోయిందో ఉదాహరణలు ఇస్తూ అందులో స్టోరీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మల్టీ స్టారర్ అయినప్పటికీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాకుండా బన్నీకి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక మాస్ కమర్షియల్ మూవీతో పుష్ప అక్కడ వందల కోట్లు కొల్లగొట్టడమే దీనికి కారణమని వేరే చెప్పాలా.
This post was last modified on July 15, 2022 5:23 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…