Movie News

ప్రభాస్ డైరెక్టర్స్ …అయ్యో పాపం !

‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత ప్రభాస్ తో సినిమా అంటే ఎవరైనా ఎగిరిగంతేస్తారు. ఇక ఈ దర్శకులకి తిరుగే లేదంటూ ఆడియన్స్ మాట్లాడుకుంటారు. సరిగ్గా సుజీత్ , రాదాకృష్ణ విషయంలో ఇదే జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇద్దరికీ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ప్రభాస్. ఇద్దరూ చేసింది ఒకే సినిమా అయినప్పటికీ ప్రభాస్ హీరో కాబట్టి యూవీ సంస్థ భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేతిలో పెట్టింది. నిజానికి ప్రభాస్ దగ్గరికి ఈ ఇద్దరినీ చేర్చింది యూవీ నిర్మాతలే అనుకోండి. కానీ ప్రభాస్ ఈ దర్శకులను నమ్మి సినిమా ఇవ్వడం గొప్ప విషయమే.

‘సాహో’ తర్వాత సుజీత్ , ‘రాధేశ్యామ్’ తర్వాత రాధాకృష్ణ ఎవరికీ దొరకకుండా డైరెక్టర్స్ గా బిజీ అయిపోతారని అనుకున్నారంత. కానీ అన్ని అనుకున్నట్లు జరిగితే మనం డెస్టినీని ఎందుకు గుర్తుచేసుకుంటాం అందుకే సుజీత్ , రాదా కృష్ణ కి కెరీర్ కి ఊహించని బ్రేక్ పడింది. ప్రభాస్ కి చెరో ఫ్లాప్ అందించి నమ్మకాన్ని వొమ్ము చేసుకోవడంతో ఇప్పుడు ఈ ఇద్దరికీ నెక్స్ట్ సినిమా ఏంటో తెలియని పరిస్థితి.

సుజీత్ ‘సాహో’ తర్వాత మెగాస్టార్ తో ‘లూసిఫర్’ రీమేక్ చేయాల్సింది. కానీ చివరి క్షణంలో ప్రాజెక్ట్ మిస్ అయ్యింది. కారణం ఏదైనా అందులో సాహో రిజల్ట్ కూడా ఉండొచ్చు. అప్పటి నుండి ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ లేదు. డివీవీ బేనర్ లో ఓ సినిమా అంటూ కొన్ని నెలలుగా వార్త చక్కర్లు కొడుతుంది ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు.

ఇక రాధాకృష్ణ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ డైరెక్టర్ కి ఎవరూ అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని టాక్. అందుకే ప్రస్తుతం ఏదో స్క్రిప్ట్ రెడీ చేస్తూ మళ్ళీ యూవీ లోనే ఏదైనా చిన్న సినిమా చేయాలనుకుంటున్నాడని తెలుస్తుంది. ఏదేమైనా ఎవరూ ఊహించని విధంగా ఈ ఇద్దరూ రెండో సినిమాకి ప్రభాస్ లాంటి స్టార్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లి అంతే స్పీడుగా కింద పడ్డారు. మరి ప్రభాస్ దర్శకులు మూడో సినిమాతో మళ్ళీ తమ టాలెంట్ నిరూపించుకుంటే అవకాశాలు అందుకొని డైరెక్టర్స్ గా బిజీ అవ్వొచ్చు.

This post was last modified on July 13, 2022 4:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

1 hour ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

8 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

8 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

9 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

11 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

11 hours ago