మాములుగా బ్లాక్ బస్టర్ సినిమాను త్రీడిలో మార్చడం చూశాం. అలా చేస్తే అభిమానుల్లోనూ ఆసక్తి కలుగుతుంది. బాహుబలినో, అమ్మోరునో ఆ ఎఫెక్ట్స్ తో చూస్తే వచ్చే కిక్కే వేరు. ఆ మధ్య రజనీకాంత్ శివాజీని ఈ టైపులో మార్చారు కానీ అదేమంత ఆశించిన ఫలితం ఇవ్వలేదు. హిందీ ఎవర్ గ్రీన్ క్లాసిక్ షోలేని ఈ మోడల్ లో చూసే అదృష్టానికి నార్త్ ఆడియన్స్ నోచుకున్నారు. హాలీవుడ్ లో ఇది నిత్యం జరిగేదే. ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన జురాసిక్ పార్క్ ని త్రీడికి మార్చినప్పుడు ప్రేక్షకులు పొందిన అనుభూతి మాటల్లో చెప్పేది కాదు.
కానీ ఒక ఫ్లాప్ మూవీకి ఈ టెక్నాలజీ అప్లై చేయడమంటే విచిత్రమే. 2001లో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేసిన ఆలవందాన్ తమిళంలోనే ఓ మోస్తరుగా ఆడింది. తెలుగులో అభయ్ పేరుతో డబ్బింగ్ చేస్తే ఇక్కడ దారుణమైన డిజాస్టర్. భారతీయుడు, భామనే సత్యభామనే లాంటి అద్భుతమైన పాత్రల్లో కమల్ ని చూసిన ప్రేక్షకులు సైకోగా లోకనాయకుడిని రిసీవ్ చేసుకోలేకపోయారు. దర్శకుడు సురేష్ కృష్ణ తీర్చిదిద్దిన తీరు టెక్నికల్ గా పేరు తెచ్చినప్పటికీ కమర్షియల్ గా అభయ్ ఎప్పటికీ ఫెయిల్యూర్ గానే పరిగణిస్తారు.
ఇప్పుడీ మూవీని 3Dలోకి కన్వర్ట్ చేసి నవంబర్ 7న కమల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారట. ఇందులో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి కానీ అవి ఇంత సాంకేతికతను డిమాండ్ చేసేవి కాదు. దీనిలో స్పెషల్ ఎఫెక్ట్స్ కు జాతీయ అవార్డు లభించింది కానీ ఇప్పటి జనరేషన్ కు అంత కిక్ ఇచ్చే కంటెంట్ ఉందని చెప్పలేం. అభయ్ ఒరిజినల్ వెర్షన్ కు కథ మాటలు స్క్రీన్ ప్లే అన్నీ సమకూర్చింది కమలే. 2019లో హేరామ్ ని రీ మాస్టర్ చేసి రిలీజ్ చేశాక ఇప్పుడిది రెండో సినిమా అవుతుంది.
This post was last modified on July 13, 2022 2:17 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…