థియేట్రికల్ రిలీజ్ అయి నెల రోజులు దాటిపోయింది. ఇంకా విక్రమ్ సినిమా షేక్ చేయడమేంటి అనిపిస్తోందా? బాక్సాఫిస్ దగ్గర ప్రకంపనలు రేపిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోనూ సంచలనం రేపుతోంది. విడుదలకు ముందే హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అన్ని భాషలకూ కలిపి రూ.125 కోట్లు పలికాయి ఆ హక్కులు. ఫాంలో లేని కమల్ నటించిన సినిమా మీద ఇంత నమ్మకమా అని అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఆ రేటుతో హాట్ స్టార్ సంస్థ జాక్ పాట్ కొట్టిందనే చెప్పాలి. ఈ సినిమాకు ఓటీటీలో వస్తున్న స్పందన అలా ఉంది మరి.
ఇప్పటిదాకా హాట్ స్టార్ ఓటీటీలో వ్యూయర్ షిప్ పరంగా అన్ని రికార్డులనూ విక్రమ్ బద్దలు కొట్టేయడం విశేషం. గత గురువారం అర్ధరాత్రి నుంచి విక్రమ్ స్ట్రీమింగ్ మొదలు కాగా.. ఒక వీకెండ్లో హాట్ స్టార్లో అత్యధిక వ్యూయర్ షిప్ తెచ్చుకున్న సినిమాగా అది రికార్డులకెక్కింది. హాట్ స్టార్ సంస్థ ఇంకా ఎక్కువ రేటు పెట్టి కొన్న హిందీ చిత్రాలను కొని రిలీజ్ చేసింది. కానీ ఆ సినిమాలను మించి విక్రమ్ వ్యూస్ తెచ్చుకుందట.
విక్రమ్ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. అది రిపీట్ వాల్యూ ఉన్న సినిమా. థియేటర్లలో చూసిన వాళ్లందరూ కూడా కచ్చితంగా ఇంకోసారి చూడాలనిపించే విషయం ఉందా చిత్రంలో. అంత డీటైలింగ్, రిపీట్ వాల్యూ ఉన్న సీన్లు ఆ సినిమాలో ఉన్నాయి. ఇక థియేటర్లలో చూడలేని వాళ్లు చాలా ఉత్కంఠగా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూశారు. ఇప్పుడు అందరూ కలిసి హాట్ స్టార్ మీద పడిపోయారు.
సినిమా స్ట్రీమింగ్ మొదలైన దగ్గర్నుంచి సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. థియేటర్లలో ఓ కొత్త సినిమా రిలీజైన రేంజిలో సోషల్ మీడియాలో విక్రమ్ గురించి చర్చ జరుగుతోంది. ఇందులో యాక్షన్ సీన్లు, అలాగే అనిరుధ్ బీజీఎం గురించి ఒక యుఫోరియా నడుస్తోంది సోషల్ మీడియాలో. కాబట్టి హాట్ స్టార్లో రికార్డులు బద్దలవడంలో ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on July 13, 2022 3:02 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…