థియేట్రికల్ రిలీజ్ అయి నెల రోజులు దాటిపోయింది. ఇంకా విక్రమ్ సినిమా షేక్ చేయడమేంటి అనిపిస్తోందా? బాక్సాఫిస్ దగ్గర ప్రకంపనలు రేపిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోనూ సంచలనం రేపుతోంది. విడుదలకు ముందే హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అన్ని భాషలకూ కలిపి రూ.125 కోట్లు పలికాయి ఆ హక్కులు. ఫాంలో లేని కమల్ నటించిన సినిమా మీద ఇంత నమ్మకమా అని అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఆ రేటుతో హాట్ స్టార్ సంస్థ జాక్ పాట్ కొట్టిందనే చెప్పాలి. ఈ సినిమాకు ఓటీటీలో వస్తున్న స్పందన అలా ఉంది మరి.
ఇప్పటిదాకా హాట్ స్టార్ ఓటీటీలో వ్యూయర్ షిప్ పరంగా అన్ని రికార్డులనూ విక్రమ్ బద్దలు కొట్టేయడం విశేషం. గత గురువారం అర్ధరాత్రి నుంచి విక్రమ్ స్ట్రీమింగ్ మొదలు కాగా.. ఒక వీకెండ్లో హాట్ స్టార్లో అత్యధిక వ్యూయర్ షిప్ తెచ్చుకున్న సినిమాగా అది రికార్డులకెక్కింది. హాట్ స్టార్ సంస్థ ఇంకా ఎక్కువ రేటు పెట్టి కొన్న హిందీ చిత్రాలను కొని రిలీజ్ చేసింది. కానీ ఆ సినిమాలను మించి విక్రమ్ వ్యూస్ తెచ్చుకుందట.
విక్రమ్ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. అది రిపీట్ వాల్యూ ఉన్న సినిమా. థియేటర్లలో చూసిన వాళ్లందరూ కూడా కచ్చితంగా ఇంకోసారి చూడాలనిపించే విషయం ఉందా చిత్రంలో. అంత డీటైలింగ్, రిపీట్ వాల్యూ ఉన్న సీన్లు ఆ సినిమాలో ఉన్నాయి. ఇక థియేటర్లలో చూడలేని వాళ్లు చాలా ఉత్కంఠగా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూశారు. ఇప్పుడు అందరూ కలిసి హాట్ స్టార్ మీద పడిపోయారు.
సినిమా స్ట్రీమింగ్ మొదలైన దగ్గర్నుంచి సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. థియేటర్లలో ఓ కొత్త సినిమా రిలీజైన రేంజిలో సోషల్ మీడియాలో విక్రమ్ గురించి చర్చ జరుగుతోంది. ఇందులో యాక్షన్ సీన్లు, అలాగే అనిరుధ్ బీజీఎం గురించి ఒక యుఫోరియా నడుస్తోంది సోషల్ మీడియాలో. కాబట్టి హాట్ స్టార్లో రికార్డులు బద్దలవడంలో ఆశ్చర్యమేమీ లేదు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…