మాములుగా ఇప్పుడున్న స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ అయ్యేలా చూసుకుంటేనే అదో పెద్ద ఘనతగా చెప్పుకునే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు కృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్లు సంవత్సరానికి పధ్నాలుగు ఎలా చేశారో ఆ దేవుడికే తెలియాలి. నాని నితిన్ టైపు మీడియం రేంజ్ బ్యాచ్ తప్ప అందరూ ఇయర్లీ వన్ పద్దతిని ఫాలో అవుతున్నారు. అనుకోకుండా ఈ ఏడాది రామ్ చరణ్ వి కేవలం 35 రోజుల గ్యాప్ లో ఆర్ఆర్ఆర్, ఆచార్య వచ్చాయి. అది కూడా కరోనా లాంటి రకరకాల కారణాలు వెనుక ఉన్నాయి లెండి.
ఇక చైతు విషయానికి వస్తే ఇరవై రోజుల వ్యవధిలో తనవి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో మొదటిది 22న రాబోతున్న థాంక్ యు. దిల్ రాజు నిర్మాతగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కి ఇంకా చెప్పుకోదగ్గ బజ్ రాలేదు. ప్రమోషన్లు మెల్లగా మొదలుపెట్టారు కానీ లవ్ స్టోరీ, బంగార్రాజు టైంలో ఉన్నంత హడావిడి కనిపించడం లేదు. చేతిలో ఇంకో పది రోజులు మాత్రమే ఉంది కాబట్టి పబ్లిసిటీని ఇంకాస్త స్పీడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది.
రెండోది ఆగస్ట్ 11న రాబోతున్న లాల్ సింగ్ చడ్డా. అమీర్ ఖాన్ హీరో అయినప్పటికీ ఇందులో చైతుకి ప్రాధాన్యం కలిగిన పాత్రే ఇచ్చారు. సో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బజ్ రావడానికి ఇదీ ఒక కారణమవుతుంది.ఎందుకో తెలియదు కానీ లాల్ సింగ్ మీద ఏమంత హైప్ లేదు. అమీర్ మూవీ వస్తుందన్నంత హంగామా బిల్డ్ కావడం లేదు. ఫారెస్ట్ గంప్ రీమేక్ అవ్వడం కొంత ఎఫెక్ట్ ఇస్తున్నా ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసేంత కంటెంట్ ఉందనే నమ్మకం కలిగించాలి. మొత్తానికి తక్కువ గ్యాప్ లో చైతు రెండు సినిమాలు వస్తున్న ఆనందం ఒకవైపు, రెండూ మాస్ జానర్ కాకపోవడం మరోవైపు అక్కినేని ఫ్యాన్స్ ని కొంత టెన్షన్ కు గురి చేస్తున్నాయి,
This post was last modified on July 12, 2022 3:00 pm
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…