‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. ఆ చిత్రంలో అతడి మ్యాన్లీ లుక్స్ చూసి బాలీవుడ్ వాళ్లు కూడా మెస్మరైజ్ అయిపోయారు. బాహుబలి అనే వాడు చేసిన విన్యాసాలు అతిగా అనిపించకుండా.. నిజంగా అతనో యోధుడు అనే భావన కలిగిందంటే అందుకు ప్రభాస్ లుక్స్, ఫిజిక్ కారణం.
ఐతే కథానాయకుడు ఎంతటి యోధుడిగా కనిపించినప్పటికీ.. అవతల ప్రతినాయకుడు కూడా బలంగా ఉంటేనే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. ‘బాహుబలి’లో హీరో పాత్ర అంతగా పండటానికి అవతల భల్లాలదేవుడిగా రానా దగ్గుబాటి దీటుగా నిలబడటం ముఖ్య కారణం. ఆ సినిమాతో రానా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ చిత్రంలో ప్రభాస్-రానాల కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఈ సినిమా తర్వాత ఎవరి దారిలో వాళ్లు ప్రయత్నిస్తున్నారు ప్రభాస్, రానా. ఐతే ఈ ఇద్దరూ కలిసి మళ్లీ ఓ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. అది.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న కొత్త చిత్రంలోనే అని వార్తలొస్తున్నాయి. ఐతే ఇందులో రానా చేయబోయేది పూర్తి స్థాయి పాత్ర కాదట. కేవలం రెండు మూడు నిమిషాల పాటు క్యామియో తరహా రోల్లో రానా కనిపిస్తాడట.
‘బాహుబలి’ అనుభవం దృష్ట్యా రానా ఇలాంటి క్యామియో చేస్తే ప్రభాస్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావించి అతణ్ని ఇందులో నటింపజేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ పున:ప్రారంభం అయ్యాక రానా పాత్ర తాలూకు చిత్రీకరణ జరుపుతారట. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ వాళ్లతో కలిసి ప్రభాస్ పెదనాన్న సంస్థ ‘గోపీకృష్ణ మూవీస్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
This post was last modified on June 30, 2020 11:15 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…