గులాబితో మొదలు పెట్టి తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాలు అందించిన విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ ఎప్పుడూ కూడా తన గురించి తాను గొప్పలు పోడు. అలాగే తన సినిమాల గొప్పదనం గురించి కూడా ఊదరగొట్టడు. చాలామంది దర్శకుల్లా సరిగా ఆడని సినిమాలు కూడా సూపర్ అని డప్పు కొట్టుకోడు. తాను తీసిన ఫ్లాప్ సినిమాల గురించి, అలాగే తన లోపాల గురించి కూడా ఆయన ఎప్పుడూ నిజాయితీగానే మాట్లాడతాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఇలాగే నిజాయితీగా చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులను ఆకట్టుకునేవే. చాలా ఏళ్ల నుంచి సరైన సినిమాలు తీయకపోవడం వల్ల తన మార్కెట్ దెబ్బ తిని నిర్మాతలు తనతో సినిమా చేయడానికి భయపడే పరిస్థితి వచ్చిందని నిజాయితీగా అంగీకరించడం విశేషం.
సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తన చివరి చిత్రం నక్షత్రం డిజాస్టర్ అయిందని, దానికి ముందు నానితో చేసిన పైసా కూడా డిజాస్టరే అని.. రామ్ చరణ్తో చేసిన గోవిందుడు అందరివాడేలే యావరేజ్ అని ఆయన పేర్కొన్నాడు. ఇలా తన ట్రాక్ రికార్డు బాలేకపోవడం వల్ల నిర్మాతలు తనతో పని చేయడంపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి వచ్చిందన్నాడు. నిర్మాత లేక ఇబ్బంది పడే పరిస్థితిని తాను ఎదుర్కొన్న మాట వాస్తవమే అని ఆయనన్నాడు.
తన సినిమాల పరాజయాల గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తుంటారని.. దానికి తానేమీ బాధపడనని కృష్ణవంశీ అన్నాడు. అదే సమయంలో వాళ్లు పొగిడితే ఆనందంగా స్వీకరిస్తానని చెప్పాడు. దర్శకుడిగా తాను ఎన్ని విజయాలు అందుకున్నప్పటికీ.. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన సమయాన్నే తాను తన జీవితంలో గోల్డెన్ ఫేజ్గా భావిస్తానని కృష్ణవంశీ చెప్పడం విశేషం. వర్మ బలవంతం చేస్తే, ఆయన ఆదేశం మేరకే తాను మెగా ఫోన్ పట్టాల్సి వచ్చిందని, అదృష్టవశాత్తూ తాను దర్శకుడిగా సక్సెస్ అయ్యానని కృష్ణవంశీ పేర్కొన్నాడు.
This post was last modified on July 10, 2022 3:26 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…