కరోనా తర్వాత మారిపోయిన పరిస్థితులను చూస్తుంటే ఏ సినిమా ఏ స్థాయిలో ఎంత రాబడుతుందో తలలు పండిన ట్రేడ్ విశ్లేషకులు సైతం ముందే చెప్పలేకపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏళ్ళ తరబడి హిట్టు లేక సతమతవుతున్న కమల్ హాసన్ కనీసం పెట్టుబడైనా వెనక్కు తెస్తారాని అనుమాన పడితే అది ఏకంగా తమిళనాడు బాహుబలి 2 రికార్డుని బద్దలు కొట్టేసింది ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తినబెట్టుకుంటారని ఆశించిన అంటే సుందరం ఫైనల్ గా 9 కోట్లు నష్టం మిగిల్చింది.
కుక్కపిల్లను టైటిల్ రోల్ లో పెట్టి కేవలం ఎమోషన్ ని మెయిన్ ఎలిమెంట్ గా తీసుకున్న 777 ఛార్లీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని భాషలకు కలిపి 30 రోజులకు వరల్డ్ వైడ్ ఏకంగా 100 కోట్ల గ్రాస్ ని దాటేసి ఔరా అనిపించేసింది. ఒక్క కన్నడ వెర్షన్ నుంచే 75 కోట్ల దాకా వసూలు కాగా తమిళనాడు 4 కోట్లు, తెలుగు రాష్ట్రాలు 4 కోట్లు, కేరళ 5 కోట్లు, మిగిలిన చోట్ల 5 కోట్ల 50 లక్షలు, ఓవర్సీస్ లో 7 కోట్ల 50 లక్షలు గ్రాస్ రాబట్టి నాన్ యాక్షన్ జానర్ లో శాండల్ వుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని తీసేసుకుని జెండా దాటింది.
ఇప్పుడు 777 ఛార్లీ అయిదో వారంలో ఉంది. దీంతో పాటు వచ్చినవి ముందు వెనుకా ఉన్నవి అన్నీ ఓటిటిలో వచ్చేశాయి. కానీ ఇది మాత్రం యాభై రోజుల టార్గెట్ పెట్టుకుని జూలై చివరి వారంలో డిజిటల్ ప్రీమియర్ ని లాక్ చేసుకుంది. ఇప్పటికీ చాలా సెంటర్స్ లో కొనసాగుతున్న ఈ పెట్ ఎంటర్ టైనర్ సక్సెస్ ఒకరకంగా పాఠమనే చెప్పాలి. థియేటర్లకు రావడానికి జనం మొండికేస్తున్న తరుణంలో కంటెంట్ కున్న ప్రాధాన్యత మరోసారి నొక్కి చెప్పినట్టు అయ్యింది. కర్ణాటక సిఎంతోనే కన్నీళ్లు పెట్టించిన రేంజ్ దీనిది.
This post was last modified on July 10, 2022 11:38 am
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…