వసూళ్ల సంగతి ఎలా ఉన్నా సర్కారు వారి పాట ఫలితం ఇటు నిర్మాతలకు అటు అభిమానులకు పూర్తి సంతృప్తినివ్వలేదన్నది వాస్తవం. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్ల నిరీక్షణకు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే బ్లాక్ బస్టర్ ఆశిస్తే దర్శకుడు పరశురామ్ జస్ట్ సూపర్ హిట్ తో సరిపుచ్చాడు. అందుకే ఇప్పుడు ప్రిన్స్ ఫ్యాన్స్ ఆశలన్నీ తన 28వ సినిమా మీద ఉన్నాయి. ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకపోవడం మీద పలు ప్రచారాలు జరగడంతో టీమ్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది. ఆగస్ట్ నుంచి చిత్రీకరణ షురూ అట.
విడుదల 2023 సమ్మర్ అని చెప్పేశారు. అంటే ఎంతలేదన్నా ఇంకో పది నెలలు పైగానే పడుతుందన్న మాట. అంత టైం ఎందుకనే కామెంట్స్ లేకపోలేదు. సాధారణంగా త్రివిక్రమ్ హడావిడిగా సినిమాలు తీయడు. అనుకుంటే మాత్రం వేగంగానే పూర్తి చేయగలడు. అరవింద సమేత వీర రాఘవ దానికి మంచి ఉదాహరణ. అల వైకుంఠపురములో తర్వాత మాటల మాంత్రికుడు చాలా గ్యాప్ తీసుకుని ఈ స్క్రిప్ట్ ని రెడీ చేశారు. మధ్యలో భీమ్లా నాయక్ కోసం కొన్ని నెలలు కేటాయించి అటెళ్ళారు కానీ లేకపోతే ఇంకా వేగంగా అయ్యేది.
ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. అంటే రాజమౌళితోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనే క్లారిటీ ఉన్నట్టే. అదే నిజమైతే జక్కన్న చేతిలో పడ్డాక కనీసం రెండేళ్లు సూపర్ స్టార్ దర్శనం తెరమీద ఉండదు. అలాంటప్పుడు ఈ త్రివిక్రమ్ మూవీని త్వరగా పూర్తి చేసి ఇంకో డైరెక్టర్ తో వేరే సినిమా చేస్తే తమకు ఎక్కువ గ్యాప్ ఉండదనేది ఫ్యాన్స్ వెర్షన్. బాహుబలి కోసం ప్రభాస్, ఆర్ఆర్ఆర్ కోసం తారక్ చరణ్ లు ఖర్చుపెట్టిన సమయం చూస్తే వాళ్ళు అడిగింది సముచితమే.
This post was last modified on July 9, 2022 2:21 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…