గుడిపూడి శ్రీహరి.. తెలుగులో సీనియర్ మోస్ట్ సినీ జర్నలిస్టుల్లో ఒకరు. నిన్నటి తరం ఫిలిం సెలబ్రెటీలందరికీ ఆయనెంతో గౌరవం. అలాగే సినిమా జర్నలిస్టులకు ఆయన ఆదర్శం. నిర్మాణాత్మకమైన విమర్శతో కూడిన ఆయన సినిమా రివ్యూలకు అప్పట్లో చాలా మంచి పేరుండేది.
‘సితార’లో ఆయన రివ్యూల కోసమే ఆ పత్రిక కొనేవాళ్లు అప్పట్లో. రాజమౌళి లాంటి లెజెండ్ ఓ సందర్భంలో తనకు నచ్చిన సినీ జర్నలిస్టుగా గుడిపూడి శ్రీహరి పేరు చెప్పాడు. ఆయన రివ్యూలను తాను ఫాలో అయ్యేవాడినని వెల్లడించాడు. ఈ దిగ్గజ సినీ జర్నలిస్టు మంగళవారం ఉదయం మరణించారు.
హైదరాబాద్లో అనారోగ్యంతో మృతి చెందారాయన. వెంటనే టాలీవుడ్ సినీ జర్నలిస్టుల ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేయగా.. దానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఈ సందర్భంగా గుడిపూడి శ్రీహరితో తనకున్న అనుబంధం, ఆయన వల్ల తాను దిద్దుకున్న ఒక లోపం గురించి వెల్లడించారు.
తన సినీ కెరీర్ ఎదుగుదలలో గుడిపూడి శ్రీహరి సహా కొందరు సినీ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించినట్లు చిరంజీవి వెల్లడించారు. వీళ్లంతా తన సినిమా సెట్కు వచ్చి సుదీర్ఘంగా మాట్లాడేవారని.. నిర్మాణాత్మకమైన విమర్శ చేసేవారని.. తప్పొప్పులు చెప్పి వాటిని సరిదిద్దేవారని చిరు అన్నారు.
శ్రీహరి సితారలో రాసిన రివ్యూలను తాను చదివేవాడినని.. కొన్నిసార్లు ఆయన మాటలు కఠినంగా ఉండేవని.. పదజాలం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. అది ఒక టీచర్ పిల్లాడికి పాఠం చెబుతున్నట్లు ఉండేదని.. అలా ఓ సందర్భంలో తన సినిమా రివ్యూ రాస్తూ తన గురించి అన్నీ పాజిటివ్గా చెప్పి.. డైలాగ్ డెలివరీ విషయం తప్పుబట్టారని చిరు చెప్పారు.
డ్యాన్సులు, ఫైట్లు లాంటివి వేగంగా ఉండొచ్చని.. కానీ మాట వేగంగా ఉంటే ప్రేక్షకుడికి డైలాగ్ అర్థం కాదని ఆయన చెప్పారని.. తర్వాత ఆయన్ని సెట్కు పిలిపించుకుని దీని గురించి అడిగితే వివరంగా చెప్పారని.. దీంతో తాను డైలాగ్ డెలివరీ విషయంలో స్పీడు తగ్గించి ప్రేక్షకుల మెప్పు పొందానని.. ఇలా ఆయన తన లోపాన్ని సరిదిద్దారని చిరు గుర్తు చేసుకున్నారు.
This post was last modified on July 5, 2022 10:18 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…